iDreamPost

ఏప్రిల్ నుండి ఈ 4 రాశుల వారికి అరుదైన లక్ష్మీ యోగం! కారణం ఏమిటంటే?

మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు శుక్రుడు మీన రాశిలో ప్రవేశించ బోతున్నాడు. ఈ క్రమంలో శుక్ర గ్రహానికి మీన రాశి ఉచ్ఛ స్థానం ఉండనుంది. శుక్రుడు ఉచ్ఛ స్థానంలో ప్రవేశించినప్పుడు , అది ఏ రాశికైనా కేంద్ర స్థానం అయినప్పుడు మాలవ్య మహాపురుష యోగం పడుతుంది.

మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు శుక్రుడు మీన రాశిలో ప్రవేశించ బోతున్నాడు. ఈ క్రమంలో శుక్ర గ్రహానికి మీన రాశి ఉచ్ఛ స్థానం ఉండనుంది. శుక్రుడు ఉచ్ఛ స్థానంలో ప్రవేశించినప్పుడు , అది ఏ రాశికైనా కేంద్ర స్థానం అయినప్పుడు మాలవ్య మహాపురుష యోగం పడుతుంది.

ఏప్రిల్ నుండి ఈ 4 రాశుల వారికి అరుదైన లక్ష్మీ యోగం! కారణం ఏమిటంటే?

చాలా మంది జ్యోతిష్య శాస్త్రానకి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుక ఆసక్తి చూపిస్తుంటారు. అదే విధంగా గ్రహాల గమనం, వాటి ప్రభావంగా ఏర్పడే  అనుకూల, ప్రతికూల అంశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలానే జ్యోతిష్య నిపుణులు, గ్రహాల భ్రమణం బట్టి..జరిగే పరిణామాలు, వివిధ రాశులకు వారికి కలిగి  లాభలు వంటి తెలుపుతుంటారు. తాజాగా మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు శుక్రుడు మీన రాశిలో సంచారం చేయబోతున్నాడు. శుక్రుడు ఉచ్ఛ స్థానంలో ప్రవేశించినప్పుడు , అది ఏ రాశికైనా కేంద్ర స్థానం అయినప్పుడు మాలవ్య మహాపురుష యోగం పడుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఓ నాలుగు రాశుల వారికి లక్ష్మీయోగం పట్టనుంది జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మరి.. ఆ రాశులు ఏమిటో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

మార్చి 30 తేదిన శుక్రుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. అలా ఈ నెల30 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు శుక్రుడు మీనా రాశిలోనే సంచరిస్తాడు. ఈ నేపథ్యంలో మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు మాలవ్య మహాపురుష యోగమనే అరుదైన లక్ష్మీ యోగం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నాలుగు రాశులకు దాదాపు నెల రోజుల పాటు తప్పకుండా దశ తిరుగుతుందని చెబుతున్నారు. ధన లక్ష్మి కటాక్షలు ఈ రాశుల వారికి ఉంటాయని పండితులు చెబుతున్నారు.

శుక్రుడు మీనారాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చే మాలవ్య మహాపురుష యోగం వృషభ రాశి వారికి పట్టనుంది. ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో ఉండటం వల్ల ఏప్రిల్ నెలలో వీరికి ఆర్థికంగా తిరుగుండదు. ఏ పని పట్టుకున్న చేకలిసి వస్తుంది.  వివిధ మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది. ఈ రాశివారు ఏ రంగానికి చెందినవారికైనా మంచి పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారని పండితులు చెబుతున్నారు.

ఇక రెండో రాశి మిథునం. ఈ రాశికి పదోస్థానంలో శుక్రుడు  ఉండటం వల్ల మిథున రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. నిరుద్యోగు శుభవార్త వింటారు. అలానే ఇప్పటికే ఉద్యోగులు చేస్తున్న వారు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయని పండితులు చెబుతున్నారు. జీవితాన్ని మలుపు తిప్పే మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏప్రిల్ నెలలో ఈ రాశివారికి అంత సానుకూలంగా ఉంటుంది.

ఇక మూడో రాశి కన్య. ఈ రాశివారికి సప్తమ కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల..వీరికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దీంతో ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి రానుంది. ఆ రాశికి చెందిన పేదవారికి సైతం అదృష్ణ భాగ్యం కలుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఏర్పడుతుంది.

ఇక మాలవ్య మహా పురుష యోగం పొందే రాశుల్లో మరో రాశి తుల. ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానంలో ఉచ్ఛ పడుతుంది.  ఈ కారణంతో తుల రాశి వారు వృత్తి, ఉద్యోగాల పరంగా అనేక శుభవార్తలు వింటారు. చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కూడా ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో బాగా కలిసి వస్తుంది. అలానే వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగం పడుతుంది. నిరుద్యోగులు ఊహించిన విధంగా పెద్ద సంస్థల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆర్థిక సంబంధమైన, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నవారు ఊహించిన లాభాలు అందుకుంటారు. మొత్తంగా ఈ నాలుగు రాశుల వారికి మాలవ్య మహా పురుష యోగం కారణంగా ఏప్రిల్ లో లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉంటుందని పండితులు అంటున్నారు. ఇది కేవలం పండితులు చెప్పిన సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి