iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ లో విషాదం.. క్యాన్సర్ తో డైరెక్టర్ కన్నుమూత!

  • Author Soma Sekhar Published - 04:03 PM, Sat - 29 July 23
  • Author Soma Sekhar Published - 04:03 PM, Sat - 29 July 23
టాలీవుడ్ లో విషాదం.. క్యాన్సర్ తో డైరెక్టర్ కన్నుమూత!

గత కొంతకాలంగా టాలీవుడ్ లో వరుస విషాదాలు నెలకొంటూనే ఉన్నాయి. అనారోగ్య కారణాలతో పలువురు నటీ, నటులు మరణించడం ఎంతో బాధాకరమైన విషయం. తాజాగా టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ NSR ప్రసాద్(49) శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ మరణించారు. టాలీవుడ్ లో ఆర్యన్ రాజేష్, శ్రీకాంత్ లాంటి హీరోలతో సినిమాలు తీశారు ప్రసాద్.

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ రైటర్, డైరెక్టర్ NSR ప్రసాద్(49) క్యాన్సర్ తో మరణించారు. గత కొంతకాలంగా ఆయన ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారు. ఇక ప్రసాద్, సీతారామ్ గా ఇండస్ట్రీకి సుపరిచితుడు. ‘నిరీక్షణ’ సినిమాతో ప్రసాద్ డైరెక్టర్ గా మారారు. ఈ మూవీలో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించారు. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా ‘శత్రువు’, నవదీప్ తో ‘నటుడు’ అనే చిత్రాలను తెరకెక్కించారు ప్రసాద్. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెక్కి’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ప్రసాద్ తన కెరీర్ లో ప్రముఖ రైటర్ల వద్ద, డైరెక్టర్ల వద్ద ఘోస్ట్ రైటర్ గా పనిచేశారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం. ఇక ఈ విషయం తెలియడంతో.. ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.