iDreamPost
android-app
ios-app

వీడియో: పొట్టుపొట్టు కొట్టుకున్న పహిల్వాన్లు.. పలువురికి గాయాలు

వీడియో: పొట్టుపొట్టు కొట్టుకున్న పహిల్వాన్లు.. పలువురికి గాయాలు

కుస్తీ పోటీల్లో యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కొందరు పహిల్వాన్ లు ఘర్షన పడ్డారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ క్రమంలో కుస్తీ పోటీలను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గొడవలకు పాల్పడిన ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఊహించని ఈ పరిణామంతో భయాందోళనకు గురైన ఆడియెన్స్ స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎల్బీ స్టేడియంలో గత 3 రోజులుగా మోడీ కేసరి కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్లో శుక్రవారం రాత్రి జాఫర్ పహిల్వాన్, సలాం పహిల్వాన్ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త ఘర్షనకు దారితీసింది. ఓ వైపు పోటీలు జరుగుతుండగానే మరో వైపు ఇద్దరు పహిల్వాన్లు వారి అనుచరులు కుర్చిలతో పొట్టుపొట్టు కొట్టుకున్నారు. రింగ్ లోనే కాదు రింగ్ బయట కూడా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రేక్షకులకు కూడా గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి జరిగిన కుస్తీ పోటీల ముగింపు ఉత్సవాల్లో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరు పహిల్వాన్ ల మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం ఘర్షన వాతావరణానికి దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు స్టేడియంకు చేరుకుని ఘర్షనలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి