iDreamPost
android-app
ios-app

ఎదురెదురుగా ఢీకొన్న ఒకే కాలేజ్ బస్సులు.. ఏకంగా 100 మంది !

  • Published Sep 27, 2024 | 1:45 PM Updated Updated Sep 27, 2024 | 1:45 PM

ఇంటి నుంచి బయటకు వెళ్లిన వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకునే వరకు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా మెదక్ జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కాలేజీకి చెందిన రెండు బస్సులో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకునే వరకు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా మెదక్ జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కాలేజీకి చెందిన రెండు బస్సులో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 27, 2024 | 1:45 PMUpdated Sep 27, 2024 | 1:45 PM
ఎదురెదురుగా ఢీకొన్న ఒకే కాలేజ్ బస్సులు.. ఏకంగా 100 మంది !

తరచూ రోడ్డు యాక్సిడెంట్స్ కు సంబంధించిన వార్తలను వింటూనే ఉంటున్నాం. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరుకునే వరకు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. స్కూల్స్ కు, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు క్షేమంగా ఇంటికి వస్తే చాలు అనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే స్కూల్ బస్సులు బోల్తా పడడం లాంటి వార్తలు తల్లి దండ్రులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో రోడ్డు ప్రమాదం అందరిని కలవర పెడుతుంది. తాజాగా మెదక్ జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కాలేజీకి చెందిన రెండు బస్సులో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్ జిల్లా నర్సాపూర్ లోని.. ఎల్లమ్మ గుడి సమీపంలో.. సంగారెడ్డి ప్రధాన రహదావారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బీవీఆర్ ఐటీ కాలేజ్ సంబంధించిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. స్పాట్ లో ఒక బస్సు డ్రైవర్ మృతి చెందాడు. ఇక ఆ రెండు బస్సుల్లో కలిపి సుమారు 100 కి మంది పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఇంకా చాలా మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఒక ఆటోని తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రస్తుతం క్షతగాత్రులను రంగారెడ్డి , నర్సాపూర్ హైదరాబాద్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీని కారణంగా నాలుగు కిలోమీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒకే కాలేజ్ కు సంబంధించిన బస్సులు కావడంతో.. విద్యార్థుల తల్లి తండ్రులు కూడా తీవ్ర ఆందోళనుకు గురౌతున్నారు.

ఇక అక్కడ దృశ్యాలు ప్రస్తుతం అందరిని కలవర పెడుతుంది. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో అక్కడ ప్రజలంతా ఇబ్బందులకు గురౌతున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా డ్రైవర్స్ కచ్చితంగా అపప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా స్కూల్ , కాలేజీ బస్సులు నడిపే డ్రైవర్స్ మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి చేతిలో కొన్ని వందల మంది విద్యార్థుల ప్రాణాలు , భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి మెదక్ జిల్లాలోని ఈ రోడ్ యాక్సిడెంట్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişeditörbetHoliganbet Giriş