iDreamPost
android-app
ios-app

పెళ్లై నెల రోజులు కూడా కాలేదు.. అంతలోనే..

  • Published May 20, 2024 | 10:48 AM Updated Updated May 20, 2024 | 10:48 AM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకమైనది.  అందుకే తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు. ఇలా ఎన్నో పెళ్లిళ్లు సందడిగా జరుగుతుంటే.. కొన్ని సార్లు మాత్రం కొందరి విషయం లో విషాదాలను మిగుల్చుతున్నాయి.

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకమైనది.  అందుకే తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు. ఇలా ఎన్నో పెళ్లిళ్లు సందడిగా జరుగుతుంటే.. కొన్ని సార్లు మాత్రం కొందరి విషయం లో విషాదాలను మిగుల్చుతున్నాయి.

  • Published May 20, 2024 | 10:48 AMUpdated May 20, 2024 | 10:48 AM
పెళ్లై నెల రోజులు కూడా కాలేదు.. అంతలోనే..

ప్రతి ఒక్కరికి జీవితంపై ఎన్నో ఆశలు ఉంటాయి. ముఖ్యంగా యువత తమ వివాహ జీవనం గురించి ఎన్నో ఆశలు, కలలు కంటారు. అలానే వారి కోరికలకు తగ్గట్లుగా చాలా వరకు నెరవేర్చుకుని జీవితాలను సంతోషంగా సాగిస్తుంటారు. కొందరి విషయంలో తల్లిదండ్రులు, సమాజంలో అనుకూలంగా ఉన్న విధి మాత్రం చిన్న చూపు చూస్తుంది. ఎంతో సంతోషంగా సాగిపోవాలని కోరుకున్న వారి జీవితం సముద్రంలో అకస్మాత్తుగా వచ్చిన ఉప్పెన మాదిరి వచ్చి.. జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. తాజాగా ఓ నవ వధువు విషయంలో అలాంటి విషాదం చోటుచేసుకుంది. పెళ్లై నెల రోజులు కాకముందే.. ఆ  ఇంటి విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకమైనది.  అందుకే తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు. ముఖ్యంగా తమకు కాబోయే భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటారు. అలా తమకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంటారు. అలానే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెళ్లిళ్లను ఎంతో ఘనంగా నిర్వహించాలని భావిస్తుంటారు. ఇరుకుటుంబాల పెద్దలతు ఎంతో ఘనంగా పెళ్లిళ్లు చేసి.. తమ బిడ్డలకు కొత్త జీవితాన్ని శ్రీకారం చుడుతుంటారు.

అయితే ఇలా ఎన్నో పెళ్లిళ్లు సందడిగా జరుగుతుంటే.. కొన్ని సార్లు మాత్రం కొందరి విషయం లో విషాదాలను మిగుల్చుతున్నాయి. రెండు రోజుల క్రితం గుత్తి సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కాబోయే వరుడు దుర్మరణం చెందాడు. తాజాగా పెళ్లైన యువతి..కాళ్ల పారాణి ఆరక ముందే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.  ఆమె చేసిన ఆ పని..వారి ఇంట విషాదం నింపింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని తార్నాక్ ప్రాంతంలో జరిగింది. లాలాగూడ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాలా పేట్ ఆర్యనగర్  ప్రాంతానికి చెందిన మౌనిక(26)కు చిలుకానగర్ ప్రాంతానికి చెందిన రమేశ్ తో ఏప్రిల్ 24న వివాహం జరిగింది. వారి వివాహాన్ని ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితులు వచ్చి..మౌనిక, రమేశ్ ల దంపతులను ఆశీర్వదించారు. అలానే పెళ్లి కార్యక్రమాలు అన్నీ పూర్తైయ్యాయి.

అలా వారి వివాహం జరిగి 25 రోజులు గడిచింది. ఇంతలోనే వారి ఇంట పెను విషాదం చోటుచేసుకుంది. గత శనివారం పుట్టింటికి భర్తతో కలిసి మౌనిక వచ్చింది.  శనివారం రాత్రి భర్త రమేశ్ తిరిగి తన ఇంటికి వెళ్లిపోగా మౌనిక అక్కడే ఉంది. ఆదివారం  స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లిన మౌనిక బోర్ మోటర్ స్విచ్ ఆన్ చేసింది. అంతలోనే బోర్ మోటర్ కి కరెంట్ సరఫర జరిగింది. ఈ క్రమంలోనే స్వీచ్ ఆన్ చేసిన మౌనిక కరెంట్ షాక్ కొట్టి మృతి చెందింది. తమ బిడ్డ సంసార జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మౌనిక తల్లిదండ్రులు.. ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయారు. పెళై నెల రోజులు కూడా గడవ ముందే.. ఇలాంటి ఘోరం జరగడంతో ఇరు కుటుంబాల సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş