iDreamPost
android-app
ios-app

ఐటీ ఉద్యోగులకు TGS RTC గుడ్ న్యూస్ ! తగ్గనున్న జర్నీ టైమ్…!

  • Published Jul 24, 2024 | 11:04 AM Updated Updated Jul 24, 2024 | 11:04 AM

TGS RTC: ఐటీ రంగాన్నికి పెట్టింది పేరు హైదరాబాద్. బెంగళూరు, పూణే వంటి నగరాల తరువాత అత్యధిక మంది ఐటీ ఉద్యోగులు ఉంది భాగ్యనగరంలోనే. ఈ ఐటీ ఎంప్లాయిస్ కి తెలంగాణ ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది. ఏంటంటే..

TGS RTC: ఐటీ రంగాన్నికి పెట్టింది పేరు హైదరాబాద్. బెంగళూరు, పూణే వంటి నగరాల తరువాత అత్యధిక మంది ఐటీ ఉద్యోగులు ఉంది భాగ్యనగరంలోనే. ఈ ఐటీ ఎంప్లాయిస్ కి తెలంగాణ ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది. ఏంటంటే..

  • Published Jul 24, 2024 | 11:04 AMUpdated Jul 24, 2024 | 11:04 AM
ఐటీ ఉద్యోగులకు TGS RTC  గుడ్ న్యూస్ ! తగ్గనున్న జర్నీ టైమ్…!

నిత్యం ఎంతో మంది వివిధ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ముఖ్యంగా ఆర్టీసీ వ్యవస్థను వినియోగించుకుని ప్రయాణం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రయాణికుల సౌకర్యం కోసం ఆర్టీసీ కూడా అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు జర్నీ పెట్టిన తరువాత కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతేకాక ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటే ఐటీ ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ న్యూస్ ఏంటి, ఆ వివరాలు ఏమిటో, ఇప్పుడు చూద్దాం..

సాఫ్ట్ వేర్ రంగాన్నికి పెట్టింది పేరు హైదరాబాద్. బెంగళూరు, పూణే వంటి నగరాల తరువాత అత్యధిక మంది ఐటీ ఉద్యోగులు ఉంది భాగ్యనగరంలోనే. ఇక  నగరంలో వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఐటీ ఉద్యోగులు నిత్యం  బైక్, కార్ల , బస్సుల ద్వారా హైటెక్ సిటీ ప్రాంతానికి చేరుతుంటారు. చాలా మంది నగరం శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటారు. అలాంటి వారు..హైటెక్ సిటికి చేరుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. ఇలా కేవలం సమయమే కాకుండా వారు చాలా రిస్క్ తో జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో నగర శివారులో ఉండే ఉద్యోగుల కోసం తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

ఇక తాజాగా టీజీ ఎస్ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో ఐటీ ఉద్యోగులకు చాలా మేలు జరగనుంది. ఐటీ కంపెనీలు అన్నీ హైటెక్  సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇదే సమయంలో చాలా మంది హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో నివాసం ఉంటారు. ఇక అక్కడి నుంచి హైటెక్ సిటీకి  చేరుకోవాలంటే.. చాలా టైమ్ తీసుకుంటుంది. హైదరాబాద్ శివారు నుంచి హైటెక్ సిటీకి రావాలంటే సికింద్రాబాద్, కోఠి, పంజాగుట్ట, అమీర్ పేట్, మెహిదీ పట్నం వంటి తదితర బస్టాప్ ల మీదుగా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది.

అలానే ఆఫీసుకు వెళ్లే సమయంలో 2 నుంచి 4 బస్సులు మారాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగులకు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండే ఆర్టీసీ అధికారులు చూస్తున్నారు.ఇప్పటికే ఘట్ కేసర్ నుంచి  హైటెక్ సిటీకి స్పెషల్ సర్వీసులు తీసుకొచ్చారు. మరో 40 రూట్ లలోనూ ఈ విధంగా సేవలు అందించేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తుంది. ఇక టీజీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే..టైమ్ ఆదా అవ్వడంతో పాటు బస్సులు మారే బాధ నుంచి విముక్తి లభించినట్లు అవుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet