Police Case On Nagole Drunk Woman: నిన్న మద్యం మత్తులో రెచ్చిపోయిన అమ్మాయి అరెస్ట్!

Hyderabad: నిన్న మద్యం మత్తులో రెచ్చిపోయిన అమ్మాయి అరెస్ట్!

శుక్రవారం నాడు నాగోల్‌లో తెల్లవారుజామునే ఓ యువతి, యువకుడు రోడ్డు మీద మద్యం సేవిస్తూ.. మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వాళ్లను బూతులు తిడుతూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు సదరు యువతికి షాక్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

శుక్రవారం నాడు నాగోల్‌లో తెల్లవారుజామునే ఓ యువతి, యువకుడు రోడ్డు మీద మద్యం సేవిస్తూ.. మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వాళ్లను బూతులు తిడుతూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు సదరు యువతికి షాక్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

రోడ్ల మీదకు వచ్చి న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. మద్యం మత్తులో నడి రోడ్డు మీద తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడమే కాక.. అడ్డు వచ్చిన పోలీసులు, జనాలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలా రోడ్ల మీద అనుచితంగా ప్రవర్తించేవారిలో మహిళలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా హైదరాబాద్‌, నాగోల్‌లో ఓ యువతి, యువకుడు ఇద్దరు రోడ్డు మీద మద్యం సేవిస్తూ రచ్చ చేశారు. ఇక్కడ తాగొద్దు అని స్థానికులు వారించడంతో.. సదరు యువతి రెచ్చి పోయింది. మద్యం సేవించొద్దు అన్నందుకు వారిని నానా బూతులు తిట్టింది. ఇక యువతి చేసిన రచ్చకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా దీనిపై పోలీసులు స్పందించారు. రోడ్డు మీద మద్యం సేవించి.. అడ్డుకున్న వారిని బూతులు తిట్టినందుకు గాను సదరు యువతి, యువకుడు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్జాదీగూడ వాసి అయిన యువకుడు అలెక్స్ (25), అతడితో పాటు ఉన్న యువతిపై ఐపీసీ 341, 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ ర్వాత యువతికి 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి పంపించారు పోలీసులు. ఇక సదరు యువతి కారు మీద 3 వేల రూపాయలకు పైగా చలాన్లు ఉన్నట్లు తెలిసింది.

Show comments