Hydలో బయటపడ్డ రూ.7,000 భారీ స్కాం..20 వేల మంది బాధితులు!

Db Stock Broking Scam: పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభాలు చూపిస్తామంటూ ఎన్నో ఫేక్ కంపెనీలు పుట్టుకు వస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో ఎంతోమంది ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి దారుణంగా మోసపోతున్నారు.

Db Stock Broking Scam: పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభాలు చూపిస్తామంటూ ఎన్నో ఫేక్ కంపెనీలు పుట్టుకు వస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో ఎంతోమంది ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి దారుణంగా మోసపోతున్నారు.

దేశంలో ఈ మధ్య మాయమాటలు చెప్పి ఎదుటివారిని క్షణాల్లో బురిడీ కొట్టించే కేటుగాళ్ళ సంఖ్య ఎక్కువైంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీగా జీవించాలనే కోరికతో ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. మీరు పెట్టిన పెట్టుబడికి రెండితలు వస్తుందని, 10 నుంచి 12 శాతం వడ్డీ ఇస్తారన్న ఆశ చూపించి డబ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రే ఉడాయిస్తున్నారు. తీరా తాము మోసపోయామని తెలిసిన బాధితులు లబో దిబో అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ తరహా మోసాల సంఖ్య బాగా పెరిగిపోయాయి. తాజాగా నగరంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల అధిక లాభాల పేరుతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి గుట్టు చప్పుటు లేకుండా ఉడాయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. నిత్యం ఇలాంటి మోసాలు జరుగుతున్నా.. బాధితుల్లో మార్పు రావడం లేదు. డబ్బు ఆశతో పెట్టుబడులు పెట్టడం.. తీరా మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయించడం సర్వసాధారణం అయ్యింది. హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది.  రూ.7 వేల కోట్ల స్కాం కు పాల్పపడిన డీబీ బ్రోకింగ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీడి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ బాధితులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అధిక లాభాల ఆశ చూపించి కంపెనీ తమను ఘోరంగా మోసం చేసిందని బాధితులతు ఆవేదన వ్యక్తం చేశారు.

స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్లు సైబరాబాద్ పోలీసులకు పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందాయి.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. డీపీ స్ట్రాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్ తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. కేవలం హైదరాబాద్ లోనే 20 వేల మంది డిబి స్టార్ బ్రోకింగ్ బాధితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు షాక్ తిన్నారు. హైదరాబాద్‌తో పాటు, కోల్‌కొతా, ముంబై, ఢిల్లీ, గౌహతి, నల్పరి, బెంగుళూరు లాంటి ప్రధాన నగరాల్లో కేసులు నమోదు అయ్యాయి.

Show comments