iDreamPost
android-app
ios-app

ఇక రోడ్లపై చెత్త వేస్తే భారీ మూల్యం తప్పదు.. సంచలన నిర్ణయం తీసుకున్న GHMC!

  • Published Nov 15, 2024 | 1:03 PM Updated Updated Nov 15, 2024 | 1:03 PM

GHMC: హైదరాబాద్ ని పరిశుభ్రంగా ఉంచాలని GHMC ఫిక్స్ అయ్యింది. అందుకోసం స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చింది.

GHMC: హైదరాబాద్ ని పరిశుభ్రంగా ఉంచాలని GHMC ఫిక్స్ అయ్యింది. అందుకోసం స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చింది.

ఇక రోడ్లపై చెత్త వేస్తే భారీ మూల్యం తప్పదు.. సంచలన నిర్ణయం తీసుకున్న GHMC!

హైదరాబాద్‌ వాసులని వణికించే న్యూస్ ఒకటి వచ్చింది. చాలా మంది బాధ్యత లేని వారు ఎక్కడపడితే అక్కడ, రోడ్లపై చెత్త వేస్తూ ఉంటారు. అలాంటి వారు చాలా ఎక్కువ అవుతున్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వలన పర్యావరణ కాలుష్యం బాగా పెరిగిపోతుంది. ఇక నుంచి ఇలాంటి పనులు చేసేవారు అడ్డంగా దొరికిపోతారు. ఎందుకంటే జీహెచ్ఎంసీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.. ఇకపై మరింత నిఘా పెరగనుంది. జీహెచ్‌ఎంసీ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే ఉప్పల్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీసీ కెమెరా, మైకును అమర్చిన నిఘా వాహనాలను పెట్టారు. ఈ వాహనాలను ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రారంభించారు.ఈ వెహికల్స్ రోడ్లపై చెత్త వేసే వారిని గుర్తించి.. వారి ఫొటో తీస్తాయి. రోడ్లపై చెత్త వేస్తున్న వారు ఆ వాహనంలో ఉన్న కెమెరా కంటికి చిక్కగానే మైకు మోగుతుంది. అప్పుడు రోడ్లపై చెత్త వేయకూడదు.. చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని అనౌన్స్ మెంట్ కూడా వస్తుంది. ఇక జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఉల్లంఘనులకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రజల్లో భయం పెరిగి మార్పు వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇలా ఈ వెహికల్స్ ద్వారా రోడ్లపై చెత్త వేసేవారిని గుర్తించేలా సరికొత్త పద్ధతిని తీసుకొచ్చామన్నారు.

అంతేగాక హైదరాబాద్‌లో పారిశుద్ధ్య విభాగాన్ని కూడా సరైన దారిలో పెట్టే పనిలో పడింది జీహెచ్‌ఎంసీ. అందుకు టెక్నాలజీని ఉపయోగించుకుని ఇంటింటి చెత్త సేకరణపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే పారిశుద్ధ్య సిబ్బంది కూడా సరిగ్గా పని చేయట్లేదు. కొన్ని డివిజన్లలో రెండు, మూడు రోజులకు గానీ స్వచ్ఛ ఆటోలు చెత్తను తీసుకుపోవట్లేదని తేలింది. ఈ విషయంపై ఇప్పటికే జీహెచ్‌ఎంసీకి చాలా ఫిర్యాదులు అందాయి. దీంతో వెంటనే అధికారులు ఈ విషయంపై కూడా ఫోకస్ పెట్టారు. దీని కోసం ప్రత్యేకంగా ఐసీసీసీ (ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్) పేరుతో నిఘా సెంటర్ ని రెఢీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కంట్రోల్‌ రూము, మొబైల్‌యాప్‌ను కూడా రెఢీ చేయనున్నారు.

జీహెచ్‌ఎంసీ మెయిన్ గా చెత్త సేకరణకు సంబంధించిన సమస్యలపై ఫోకస్ పెట్టింది. ప్రతి రోజు కూడా చెత్తను సేకరిస్తే వీధుల్లో చెత్త కుప్పలు ఉండవు. అయితే ఎక్కువమంది స్వచ్ఛ ఆటోల డ్రైవర్లు రోజూ చెత్త సేకరణకు వెళ్లట్లేదని తెలిసింది. అందుకే ఆటో కార్మికులకు చెత్త సేకరణలో ఎదురవుతోన్న సమస్యలు, వారి వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు తెలుసుకుంటున్నారు. పలు వ్యాపార కేంద్రాల్లో, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న చెత్తను ఏం చేయాలి అనే విషయంపై జీహెచ్‌ఎంసీ అధ్యయనం చేస్తోంది. అందుకు ప్రతి ఆటోకు కూడా కొన్ని రోడ్లను కేటాయించనున్నారు. వారు ప్రతి రోజూ వెళ్తున్నారా, లేదా గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఇక ఇప్పటికే కొన్ని స్వచ్ఛ ఆటోలకు జీపీఎస్‌ డివైజ్ లను ఫిక్స్ చేయగా మిగిలిన వాటికి కూడా జీపీఎస్ పెట్టి.. ఐసీసీసీ, మొబైల్‌ యాప్‌ ద్వారా వాటిపై నిఘా ఉంచాలని డిసైడ్ అయ్యారు. ఇదీ సంగతి. మరి జీహెచ్‌ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş