iDreamPost
android-app
ios-app

ప్రజలకు అలర్ట్.. వారికి వరుసగా ఐదు రోజులు సెలవులు

  • Published Apr 05, 2024 | 7:59 PM Updated Updated Apr 05, 2024 | 7:59 PM

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నిత్యం రైతులు వివిధ రకాల పంటల విక్రయాలతో జోరుగా వ్యాపారం కొనసాగిస్తుంటారు. అయితే ఈ మార్కెట్ కు ప్రభుత్వం 5 రోజుల పాటు సెలువులు ప్రకటించి ఊహించని షాక్ ను ఇచ్చింది. అసలు కారణమేమిటంటే..

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నిత్యం రైతులు వివిధ రకాల పంటల విక్రయాలతో జోరుగా వ్యాపారం కొనసాగిస్తుంటారు. అయితే ఈ మార్కెట్ కు ప్రభుత్వం 5 రోజుల పాటు సెలువులు ప్రకటించి ఊహించని షాక్ ను ఇచ్చింది. అసలు కారణమేమిటంటే..

  • Published Apr 05, 2024 | 7:59 PMUpdated Apr 05, 2024 | 7:59 PM
ప్రజలకు అలర్ట్.. వారికి వరుసగా ఐదు రోజులు సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురించి అందరికి తెలిసిందే. ఇది ఆసియాలోనే రెండవ అతి పెద్ద మార్కెట్ గా పేరుగాంచింది. కాగా, ఈ మార్కెట్ 117 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. పై గా ఈ మార్కెట్ ను తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీగా నిర్వహిస్తుంది. ఇక ఇక్కడకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా.. రైతులు పండించిన వివిధ రకరకాల పంటలను అమ్మడానికి తీసుకువస్తుంటారు. ఈ క్రమంలోనే ఎనుమాముల మార్కెట్ లో.. 450 మంది ఆడితిదారులు,300 మంది వ్యాపారులు, 800 మంది పరిపాలన సిబ్బంది, అలాగే వేలాది మంది కూలీలు ఉంటారు. పైగా ఈ మార్కెట్ లో మిర్చి, పత్తి అమ్మకాలు ఎప్పుడు ఉత్తమ స్థానంలో ఉంటుంది. వాటితో పాటు పలు పంటల విక్రయాలు కూడా ఇక్కడ జోరుగా సాగుతుంటాయి. అంతేకాకుండా.. ఎంత సరుకు వచ్చినా సరే ఒక్కరోజులోనే రైతులు తమ దిగుబడులను అమ్ముకొని వెళ్తుంటారు. నిత్యం ఈ మార్కెట్ లో పంటల విక్రయాలతో జోరుగా వ్యాపారం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వ 5 రోజులు సెలవును ప్రకటిస్తూ ఊహించని షాక్ ను ఇచ్చింది. అసలు కారణమేమిటంటే..

నిత్యం రైతుల పంట విక్రయాలతో రద్దీగా ఉన్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు తాజాగా ప్రభుత్వం 5 రోజులపాటు సెలవులు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా రైతులకు ఊహించని షాక్ తగిలింది. అయితే సెలవులు అనేవి ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉంటాయని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ మేరకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంగయ్య కూడా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ సెలవలకు కారణం.. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 6న వారాంతపు యార్డ్ బంద్,7న ఆదివారం, 8న అమావాస్య, 9న ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో 5 రోజులపాటు మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. ఇక రైతులు కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇక సెలవుల అనంతరం మళ్లీ యధావిధిగా ఈ నెల 10న నుంచి మార్కెట్ లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.

దీంతో, అసలే పండుగ సీజన్ కావడంతో..పంటను అమ్ముకుని లాభాలను ఆర్జించలి అనుకున్న రైతులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పైగా, ఇప్పటికే నీరు లేక పంటలు ఎండిపోవడం , అకాల వర్షాలకు చేతి కొచ్చిన పంట నేలరాలడంతో రైతు కంట కన్నీరు వస్తుంది. అయితే వీటన్నీంటిని తట్టుకొని వచ్చిన పంటను పండగ సమయంలో అమ్ముకొని లాభాలను పొందాలి అనుకున్న అన్నదాతల ఆశలు ఆవిరైపోయాయి. ఇక ఈ సెలవులు కారణంగా పంటలతో నిండుగా ఉండవల్సిన వరంగల్ జిల్లా ఏనుమాములు మార్కెట్ ఇప్పుడు ఖాళీగా కనిపించనుంది. మరి, పండుగలా సీజన్ కావడంతో వరుసగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు సెలవులు ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom Girişmeritbetbetvoleİmajbet güncel girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet