iDreamPost

Rohit Sharma: క్రెడిట్ అంతా రోహిత్​కే.. ఆ ప్లేయర్​కు అన్యాయం చేస్తున్నారు: మాజీ క్రికెటర్

  • Published Jun 28, 2024 | 7:35 PMUpdated Jun 28, 2024 | 7:35 PM

ఇంగ్లండ్​పై ఘనవిజయం సాధించి పొట్టి కప్పు ఫైనల్స్​లోకి దర్జాగా అడుగుపెట్టింది టీమిండియా. బట్లర్ సేనను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. కప్పు కోసం తుదిపోరులో సౌతాఫ్రికాతో తాడోపేడో తేల్చుకోనుంది.

ఇంగ్లండ్​పై ఘనవిజయం సాధించి పొట్టి కప్పు ఫైనల్స్​లోకి దర్జాగా అడుగుపెట్టింది టీమిండియా. బట్లర్ సేనను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. కప్పు కోసం తుదిపోరులో సౌతాఫ్రికాతో తాడోపేడో తేల్చుకోనుంది.

  • Published Jun 28, 2024 | 7:35 PMUpdated Jun 28, 2024 | 7:35 PM
Rohit Sharma: క్రెడిట్ అంతా రోహిత్​కే.. ఆ ప్లేయర్​కు అన్యాయం చేస్తున్నారు: మాజీ క్రికెటర్

ఇంగ్లండ్​పై ఘనవిజయం సాధించి పొట్టి కప్పు ఫైనల్స్​లోకి దర్జాగా అడుగుపెట్టింది టీమిండియా. బట్లర్ సేనను చిత్తు చేసిన రోహిత్ సేన.. కప్పు కోసం తుదిపోరులో సౌతాఫ్రికాతో తాడోపేడో తేల్చుకోనుంది. ఇక, నిన్నటి మ్యాచ్​లో మెన్ ఇన్ బ్లూ ఆల్​రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని యూనిట్లు కలసికట్టుగా రాణించడంతో మనకు తిరుగులేకపోయింది. మ్యాచ్ మొత్తం ఫెంటాస్టిక్​ గేమ్​తో అలరించారు భారత ఆటగాళ్లు. బ్యాటింగ్​లో రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (47), హార్దిక్ పాండ్యా (23) సూపర్బ్ నాక్స్ ఆడారు. బౌలింగ్​లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా 2 వికెట్లతో ప్రత్యర్థి వెన్ను విరిచాడు.

బౌలింగ్​లో 3 వికెట్లు తీయడమే గాక ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చి 10 పరుగులు చేసిన అక్షర్​కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. క్రీజులో కుదురుకున్న జోస్ బట్లర్​తో పాటు డేంజరస్ జానీ బెయిర్​స్టో, మొయిన్ అలీని ఔట్ చేశాడు అక్షర్. ఈ మ్యాచ్ అనే కాదు.. గత మ్యాచుల్లోనూ అతడు అద్భుతమైన బౌలింగ్​తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్​గా ఈ వరల్డ్ కప్​లో 8 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లో చివర్లో వచ్చి మంచి కాంట్రిబ్యూషన్ అందిస్తున్నాడు అక్షర్. అయినా అతడికి అంతగా క్రెడిట్ దక్కడం లేదు. రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్లకు దక్కినంత ప్రశంసలు అక్షర్​కు దక్కడం లేదు. ఇదే విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రియాక్ట్ అయ్యాడు. అక్షర్​కు అన్యాయం చేస్తున్నారంటూ అతడు సీరియస్ అయ్యాడు.

‘అక్షర్ పటేల్ ఓ అద్భుతమైన ఆటగాడు. వరల్డ్ కప్​లో అతడి బౌలింగ్ నెక్స్ట్ లెవల్​లో ఉంది. బ్యాటింగ్, ఫీల్డింగ్​లోనూ అతడు తన మార్క్ చూపిస్తున్నాడు. కానీ అతడికి అన్యాయం జరుగుతోంది. అతడికి దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కడం లేదు. పాకిస్థాన్​తో లీగ్ మ్యాచ్​లో రాణించినా అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు. నిన్న ఇంగ్లండ్ మీద కూడా అతడు సూపర్బ్​గా బౌలింగ్ చేసి మ్యాన్ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు. అయినా అక్షర్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇది కరెక్ట్ కాదు’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా, పాకిస్థాన్​తో మ్యాచ్​లో 2 ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్.. 11 పరుగులు మాత్రమే 1 వికెట్ తీశాడు. బ్యాటింగ్​లోనూ 20 పరుగులతో సత్తా చాటాడు. ఆ తర్వాతి మ్యాచుల్లోనూ రాణించిన అతడు.. ఇంగ్లండ్ మ్యాచ్​లో మరింత రెచ్చిపోయాడు. అతడు అదే విధంగా ఆడితే ఫైనల్​లో భారత్​కు తిరుగుండదు. మరి.. అక్షర్​కు అంతగా క్రెడిట్ ఇవ్వట్లేదనే వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి