SNP
SNP
చాలా మంది యువ క్రికెటర్లకు బీసీసీఐ మంచి అవకాశం కల్పించింది. సెప్టెంబర్లో ప్రారంభం కానున్న ఆసియా గేమ్స్కు పూర్తిగా యువ క్రికెటర్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ యంగ్ టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా నియమించింది. అలాగే ఐసీఎల్ 2023లో సంచలనం సృష్టించిన కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్కు ఈ టీమ్లో చోటు కల్పించడంపై క్రికెట్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి రింకూ సింగ్కు వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోసమే ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ, ఆ సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో బీసీసీఐపై విమర్శల వర్షం కురిపించారు. టాలెంట్ ఉన్న యువ క్రికెటర్లను మీ రాజకీయాలతో తొక్కేస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. వెంటనే తప్పు తెలుసుకున్న సెలెక్టర్లు.. ఆసియా గేమ్స్కు ప్రకటించిన టీమ్లో రింకూకు చోటిచ్చారు. దీంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ కాస్త శాంతించారు.
అయితే.. రింకూ సింగ్ ఆసియా గేమ్స్తో పాటు ఐర్లాండ్తో టీ20 సిరీస్కు కూడా ఎంపిక కానున్నాడని సమాచారం. దీంతో ఈ విషయంపై రింకూ స్పందిస్తూ.. తన జీవితంతో టీమిండియా జెర్సీ ధరించడం కంటే గొప్ప క్షణం మరొకటి ఉండదని, ఆ క్షణం కచ్చితం తాను కన్నీళ్లు ఆపుకోలేనని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు చూసిన తాను ఎమోషనల్గా స్ట్రాంగ్గానే ఉన్నా.. టీమిండియా జెర్సీ వేసుకోడం చాలా భావోద్వేగపూరితమైన క్షణమని రింకూ పేర్కొన్నాడు. మరి రింకూ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: కోహ్లి, రహానేను అవమానించిన ఇషాన్.. ఇవే తగ్గించుకో అంటున్న ఫ్యాన్స్!