Virat Kohli: కోహ్లీ ఎన్ని సాధించినా దండగే.. ఆ ఒక్క పని చేస్తేనే గ్రేట్: యూనిస్ ఖాన్

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్​ను కూడా చేతబట్టాడు. అయితే కింగ్ ఎన్ని సాధించినా దండగేనని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ అంటున్నాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్​ను కూడా చేతబట్టాడు. అయితే కింగ్ ఎన్ని సాధించినా దండగేనని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ అంటున్నాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్​ను కూడా చేతబట్టాడు. కెరీర్ మొదట్లోనే అతడు వన్డే వరల్డ్ కప్-2011 గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మెగాటోర్నీతో కోహ్లీ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టీమ్​లో మెయిన్ ప్లేయర్ రేంజ్​కు చేరుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ జట్టును కెప్టెన్​గా ముందుండి నడిపించాడు. దూకుడైన సారథ్యంతో ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకు పుట్టించాడు. ఇంత చేసినా మళ్లీ ప్రపంచ కప్​ను అందుకోలేదు. అయితే అందని ద్రాక్షగా ఉన్న కప్పును ఇటీవలే ఒడిసిపట్టి సంతోషంలో మునిగిపోయాడు.

క్రికెట్​లో లెక్కకు మిక్కిలి రికార్డులను తన పేరు రాసుకున్న కోహ్లీ.. పొట్టి కప్పు గెలిచి తన కెరీర్​ను మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మీద ఫోకస్ పెడుతున్నాడు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్-2023 చేతి దాకా వచ్చి మిస్సైన నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో అయినా ఆ కలను నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. సేమ్ టైమ్ ఫిట్​నెస్​ ఇలాగే మెయింటెయిన్ చేస్తూ వన్డే వరల్డ్ కప్-2027లోనూ ఆడాలని చూస్తున్నాడు. కోహ్లీ, రోహిత్ ఈ టోర్నీలో ఆడే ఛాన్స్ ఉందని ఇటీవల కొత్త కోచ్ గౌతం గంభీర్ కూడా అన్నాడు. ఇదిలా ఉంటే.. కెరీర్​లో ఎన్నో ఘనతలు సాధించిన కోహ్లీని పాకిస్థాన్ లెజెండ్ యూనిస్ ఖాన్ టార్గెట్ చేశాడు. విరాట్ ఎంత చేసినా వేస్ట్ అని.. అతడి కెరీర్​లో ఒక వెలితి ఉందన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం విరాట్ పాకిస్థాన్​కు రావాలని కోరాడు యూనిస్ ఖాన్. పాక్​కు వచ్చి అతడు పరుగుల వరద పారించాలని, సెంచరీల మీద సెంచరీలు బాదాలని.. అప్పుడు అతడు నిజంగా గ్రేట్ ప్లేయర్​ అని ఒప్పుకుంటానన్నాడు యూనిస్. ‘ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం కోహ్లీ మా దేశానికి రావాలి. ఇది మా అందరి కోరిక. అతడు కెరీర్​లో ఎన్నో సాధించాడు. కానీ పాక్​కు రాకపోవడం ఒక్కటే వెలితిగా ఉండిపోయింది. కాబట్టి పాక్​కు వచ్చి అతడు పరుగులు చేయాలి, సెంచరీలు బాదాలి’ అని యూనిస్ చెప్పుకొచ్చాడు. మరో పాక్ దిగ్గజం షాహిద్ అఫ్రిదీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీ తమ దేశానికి వస్తే ఆతిథ్యం ఎలా ఉంటుందో చూపిస్తామన్నాడు. అయితే భద్రతాపరమైన కారణాలు, దౌత్యపరమైన ఇబ్బందులు, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్​కు వెళ్లేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు.

Show comments