iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్‌లో కోహ్లీ-రోహిత్ మధ్య కొత్త అగ్రిమెంట్! ఇది గమనించారా?

  • Published Oct 30, 2023 | 6:17 PM Updated Updated Oct 30, 2023 | 6:17 PM

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే.. భారత జట్టు సాధిస్తున్న ఈ విజయాల వెనుక స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, కోహ్లీ కూడా ఉన్నారు. అయితే వారి మధ్య ఓ అగ్రిమెంట్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే.. భారత జట్టు సాధిస్తున్న ఈ విజయాల వెనుక స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, కోహ్లీ కూడా ఉన్నారు. అయితే వారి మధ్య ఓ అగ్రిమెంట్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Oct 30, 2023 | 6:17 PMUpdated Oct 30, 2023 | 6:17 PM
వరల్డ్ కప్‌లో కోహ్లీ-రోహిత్ మధ్య కొత్త అగ్రిమెంట్! ఇది గమనించారా?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్టుగా ఉంది రోహిత్‌ సేన. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి ఇప్పటికే దాదాపు సెమీస్‌ చేరిపోయింది. ఇక సెమీస్‌ కంటే ముందు మిగిలిన మూడు మ్యాచ్‌లో కూడా టీమిండియాకు పెద్దగా పోటీ ఎదురుకాకపోవచ్చు. ఒక్క సౌతాఫ్రికానే కాస్తో కూస్తో పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. శ్రీలంక, నెదర్లాండ్స్‌ జట్లు.. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్‌ ముందు నిలబడకపోవచ్చు. అయితే.. ఇప్పటి వరకు టీమిండియా సాధించిన విజయాల్లో ఎక్కువ క్రెడిట్‌ బౌలర్లకే ఇవ్వాల్సి ఉంటుంది.

ఎందుకంటే.. ఆరంభం నుంచి ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఛేజ్‌ చేసి గెలిసింది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్లను టీమిండియా బౌలర్లు తక్కువ స్కోర్‌కే పరిమితం చేసి.. బ్యాటర్ల పని సులువు చేశారు. కానీ, తొలి సారి ఈ టోర్నీలో టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. కానీ, ఇంగ్లండ్‌ బౌలింగ్‌ టఫ్‌గా ఉండటంతో.. టీమిండియా కేవలం 229 పరుగులకే పరిమితం అయింది. గిల్‌, కోహ్లీ, అయ్యర్‌ దారుణంగా విఫలం అయ్యారు. కానీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 87 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును ఆదుకున్నాడు. అలాగే కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, బమ్రా సైతం విలువైన పరుగులు జోడించారు. 200 మార్క్‌ దాటడంతో ఒక సైకలాజికల్‌ టోటల్‌ సెట్‌ అయింది.

ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ-విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఇద్దరు గ్రేట్‌ బ్యాటర్ల మధ్య ఓ అగ్రిమెంట్‌ కుదిరినట్లు కనిపిస్తోంది. అదేంటంటే.. ఒకరు ఆడకపోయినా మరొకరును జట్టును కచ్చితంగా ఆడాలనే ఒప్పందం. అవునా.. వినేందుకు సరదాగా ఉన్నా.. ఈ ఇద్దరు టీమిండియా రెండు కళ్లలాంటి ఆటగాళ్లు. వీరిలో ఏ ఒక్కరు నిలబడినా.. జట్టుకు విజయాన్ని అందించగల ఉద్ధండులు. పైగా వీరు రాణిస్తే.. జట్టులోని ప్రతి ఒక్కరు ఇన్స్‌పైర్‌ అవుతుంటారు. జట్టుపై ఈ ఇద్దరి ఇంప్యాక్ట్‌ ఆరేంజ్‌లో ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ డకౌట్‌ అయితే.. జట్టుకు తన అవసరం తెలుసుకున్న కోహ్లీ.. చివరి వరకు ఆడి 85 రన్స్‌ చేసి కీ రోల్‌ పోషించాడు. తాజాగా ఇంగ్లండ్‌పై కోహ్లీ డకౌట్‌ అయితే.. వెంటనే తన రోల్‌ గుర్తించిన రోహత్‌ శర్మ 87 రన్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఇలా ఇద్దరు ఆటగాళ్లు ఒక అండ్రస్టాండింగ్‌తో ఇన్నింగ్స్‌లో తమ ఇద్దరిలో కచ్చితం ఒకరు నిలబడాల్సిందే అని ఫిక్స్‌ అయి ఆడుతున్నారంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.