ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గంభీర్‌.. పగలబడి నవ్వాడు! నవ్వించింది ఎవరో తెలుసా?

ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గంభీర్‌.. పగలబడి నవ్వాడు! నవ్వించింది ఎవరో తెలుసా?

Virat Kohli, Gautam Gambhir, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న భారత జట్టులో కొన్ని ఊహించని సీన్స్‌ చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గంభీర్‌ పగలబడి నవ్వుతున్నాడు.. అతన్ని అంతలా నవ్వించింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, Gautam Gambhir, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న భారత జట్టులో కొన్ని ఊహించని సీన్స్‌ చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే గంభీర్‌ పగలబడి నవ్వుతున్నాడు.. అతన్ని అంతలా నవ్వించింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై ఫోకస్‌ పెట్టింది. శుక్రవారం నుంచి భారత్‌-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌తో సూపర్‌ స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఎంట్రీ ఇవ్వనున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన కోహ్లీ, రోహిత్‌.. ఆ మెగా టోర్నీ తర్వాత.. తొలి సారి గ్రౌండ్‌లోకి దిగుతున్నారు. దీంతో క్రికెట్‌ అభిమానులు ఈ సిరీస్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో పాటు గౌతమ్‌ గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా కోహ్లీ, రోహిత్‌ ఆడే ఫస్ట్‌ సిరీస్‌ ఇదే.

గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లీకి అస్సలు పడదని, శ్రీలంకతో సిరీస్‌లో ఇద్దరు ఎలా ఉంటారో అని భారత క్రికెట్‌ అభిమానులంతా ఎగ్జైట్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్‌ కోసం సోమవారమే లంకకు చేరుకున్నాడు. గంభీర్‌ మాత్రం.. మంగళవారం రాత్రి భారత్‌-శ్రీలంక మధ్య చివరి టీ20 మ్యాచ్‌ తర్వాత బుధవారం వన్డే టీమ్‌తో జతకలిశాడు. టీ20 మ్యాచ్‌ పల్లెకలెలో జరిగిన విషయం తెలిసిందే. పల్లెకలె నుంచి కొలంబో చేరుకున్న గంభీర్‌.. టీమ్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. అక్కడే కోహ్లీతో కలిసిన గంభీర్‌ చాలా సేపు అతనితో మాట్లాడాడు.

ఇద్దరు చాలా సేపు ముచ్చట్లు పెట్టుకున్నాడు. ఈ సమయంలో గంభీర్‌ పగలపడి నవ్వుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఎప్పుడూ సీరియస్‌గా ఉంటే గంభీర్‌.. కోహ్లీతో మాట్లాడుతూ ఇంతలా నవ్వుతుండటంతో క్రికెట్‌ అభిమానులు షాక్‌ అవుతున్నారు. టీమిండియాకు ఆడుతున్న సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య రెండు మూడు సార్లు గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో కూడా పెద్ద గొడవ జరిగింది. దీంతో.. టీమిండియాలో ఎలా ఉంటారో అని అంతా భయపడుతున్న తరుణంలో ఈ సీన్స్‌తో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకు​న్నారు. మరి గంభీర్‌-కోహ్లీ ఇంత సరదాగా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments