మాజీ బ్యాటింగ్ కోచ్​ రాథోడ్​కు కీలక బాధ్యతలు.. గంభీర్ మాట వినని BCCI!

Vikram Rathour: టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాథోడ్ కోసం కొత్త కోచ్ గంభీర్ మాటను కూడా బోర్డు లెక్కచేయలేదని వినికిడి.

Vikram Rathour: టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాథోడ్ కోసం కొత్త కోచ్ గంభీర్ మాటను కూడా బోర్డు లెక్కచేయలేదని వినికిడి.

టీ20 వరల్డ్ కప్-2024 తర్వాత భారత క్రికెట్​లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్త కోచ్​తో పాటు నయా కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా వచ్చేశారు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆయన స్థానంలో కొత్త కోచ్​గా మరో దిగ్గజం గౌతం గంభీర్​ను నియమించింది భారత క్రికెట్ బోర్డు. వన్డేలు, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్​గా కొనసాగనున్నాడు. అయితే టీ20లకు మాత్రం సారథిని మార్చింది. పొట్టి ఫార్మాట్ నయా కెప్టెన్​గా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్​ను నియమించింది. అలాగే వన్డేలు, టీ20లకు వైస్ కెప్టెన్​గా కుర్ర క్రికెటర్ శుబ్​మన్ గిల్​ను ఎంపిక చేసింది.

ఇన్ని మార్పులు చేసిన బీసీసీఐ.. త్వరలో సపోర్ట్ స్టాఫ్ విషయంలోనూ ఛేంజెస్​ చేయనుంది. పాత బ్యాటింగ్ కోచ్​ విక్రమ్ రాథోడ్, పాత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్థానంలో కొత్తవాళ్లు ఆ బాధ్యతలు తీసుకోనున్నారు. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ జట్టుతోనే కంటిన్యూ కానున్నాడని.. అతడ్ని మరింత కాలం సీనియర్ టీమ్​తో ఉంచాలని బోర్డు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు కొత్త కోచ్ గంభీర్ కూడా ఓకే చెప్పాడని వినిపిస్తోంది. అయితే ఫీల్డింగ్ కోచ్​కు ఓకే చెప్పిన గంభీర్.. ఓ విషయంలో పాత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్​కు అడ్డుపుల్ల వేశాడని సమాచారం. కానీ బీసీసీఐ మాత్రం అదేదీ పట్టించుకోకుండా రాథోడ్​ సేవల్ని మరో విధంగా వాడుకోవాలని యోచిస్తోందట.

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ నయా హెడ్​గా విక్రమ్ రాథోడ్​ను నియమించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఈ పోస్ట్​లో ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం ఈ సెప్టెంబర్​తో ముగుస్తుంది. ఆయన కాంట్రాక్ట్​ను రెన్యువల్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈ పదవిలో కంటిన్యూ అయ్యేందుకు లక్ష్మణ్ ఆసక్తిగా లేకపోవడంతో రాథోడ్​కు కీలక పోస్ట్​ ఇచ్చేందుకు బోర్డు సిద్ధమైనట్లు వినికిడి. ఐసీసీ యానువల్ మీటింగ్ కోసం లంకకు వెళ్లిన బీసీసీఐ సెక్రెటరీ జైషా భారత్​కు తిరిగొచ్చిన వెంటనే ఈ నియామకంపై తేల్చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే రాథోడ్​ను ఆ పదవిలోకి తీసుకురావడం గంభీర్​కు ఇష్టం లేదనే రూమర్స్ వస్తున్నాయి. కానీ బోర్డు వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని.. ఇదంతా ట్రాష్ అని అంటున్నాయి. మరి.. విక్రమ్ రాథోడ్ ఎన్​సీఏ బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments