Arshdeep Singh: కప్పు​ గెలిచాక ఏడ్వాలని అనుకున్నా.. కానీ అది ఆపేసింది: అర్ష్​దీప్ సింగ్

టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకోవడంలో పేసర్ అర్ష్​దీప్ సింగ్ పాత్ర కూడా ఎంతో ఉంది. జస్​ప్రీత్ బుమ్రాకు తోడుగా అర్ష్​దీప్ రాణించడం వల్లే బౌలింగ్​లో భారత్​కు ఎదురు లేకుండా పోయింది.

టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకోవడంలో పేసర్ అర్ష్​దీప్ సింగ్ పాత్ర కూడా ఎంతో ఉంది. జస్​ప్రీత్ బుమ్రాకు తోడుగా అర్ష్​దీప్ రాణించడం వల్లే బౌలింగ్​లో భారత్​కు ఎదురు లేకుండా పోయింది.

అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్​ను భారత్​ కైవసం చేసుకోవడంలో అటు బ్యాటర్లతో పాటు ఇటు బౌలర్ల పాత్ర కూడా ఎంతో ఉంది. బ్యాటింగ్​ యూనిట్​లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, అక్షర్ పటేల్ సత్తా చాటారు. బౌలింగ్​లో జస్​ప్రీత్ బుమ్రా దగ్గర నుంచి అర్ష్​దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ వరకు అందరూ రాణించారు. బుమ్రా బౌలింగ్ అటాక్​ను లీడ్ చేయగా.. అతడి నేతృత్వంలో అర్ష్​దీప్ చెలరేగిపోయాడు. ఏకంగా 17 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇది అర్ష్​దీప్​కు హెల్ప్ అయింది. అతడి బౌలింగ్​లో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు.

ప్రపంచ కప్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన అర్ష్​దీప్ సింగ్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఫైనల్ మ్యాచ్​లో గెలిచాక తాను ఎమోషనల్ అయ్యానని అన్నాడు అర్ష్​దీప్. అయితే ఎంత ఏడ్వాలని అనుకున్నా తనకు కన్నీళ్లు రాలేదన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో పంజాబ్ కింగ్స్ టీమ్ తరఫున ఎన్నో థ్రిల్లర్ మ్యాచ్​లు ఆడానన్నాడు. ఆఖరి బంతి వరకు వెళ్లిన మ్యాచులు చూడటంతో మనసుకు అలవాటు అయిందన్నాడు. అందుకే తాను తీవ్ర భావోద్వేగానికి లోనవ్వలేదని చెప్పాడు. తనకు కన్నీళ్లు రాలేదన్నాడు. కానీ ఫైనల్​లో విక్టరీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం ఏడ్చేశారని తెలిపాడు అర్ష్​దీప్. వాళ్లిద్దరూ చాలా ఎమోషనల్ అయిపోయారని పేర్కొన్నాడు.

సౌతాఫ్రికాపై గెలిచి కప్పు అందుకున్న తరుణంలో రోహిత్-కోహ్లీ సంతోషంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారని అర్ష్​దీప్ అన్నాడు. వాళ్లిద్దరూ ట్రోఫీతో టీ20 కెరీర్​ను ముగించడం హ్యాపీ అని వివరించాడు. ఇక, అర్ష్​దీప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరల్డ్ కప్​ గెలిచాక రోహిత్, కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ తదితరులు ఎమోషన్ ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారని.. కానీ అర్ష్​దీప్ మాత్రం కామ్​గా ఉన్నాడని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అతడి స్వభావం అలాంటిదని, ఇందులో ఆశ్చర్యమేమీ లేదని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం కోహ్లీ, రోహిత్ మాదిరిగా భారీ ఓటములు, వరల్డ్ కప్​ చేతి దాకా వచ్చి మిస్ అయితే ఉండే బాధ ఏంటో అర్ష్​దీప్​కు తెలియదని కామెంట్స్ చేస్తున్నారు. రోకో జోడీ ఎన్నో సార్లు కప్ మిస్ అయిందని, అందుకే అంతగా ఏడ్చారని అంటున్నారు.

Show comments