వీడియో: ప్రధాని మోడీని కలిసిన టీమిండియా! ఒకటే నవ్వులు..

వీడియో: ప్రధాని మోడీని కలిసిన టీమిండియా! ఒకటే నవ్వులు..

Team India, PM Narendra Modi, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టు.. మర్యాదపూర్వకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Team India, PM Narendra Modi, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టు.. మర్యాదపూర్వకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ నెగ్గిన భారత జట్టు.. కాస్త ఆలస్యంగా స్వదేశానికి తిరిగి వచ్చింది. జూన్‌ 29నే సౌతాఫ్రికాతో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసినా.. అక్కడ తుపాను కారణంగా విమాన సర్వీసులు ఆలస్యం అవ్వడంతో వెంటనే ఇండియాకు తిరిగి రాలేకపోయింది భారత జట్టు. తాజాగా గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన భారత జట్టు అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి.. రెడీ అయి.. ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని నివాసంలో ఈ రోజు ఉదయం భారత జట్టుకు ఆల్పాహార విందు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత క్రికెటర్లతో సరదాగా ముచ్చటించారు. వరల్డ్‌ కప్‌ గెలిచిన అనుభూతులు, టోర్నీ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సరదాగా సరదాగా కనిపించారు. ఆటగాళ్లు కూడా జోకులు వేయడంతో అక్కడ నవ్వులు పూసాయి. అయితే.. మోదీతో మన ఆటగాళ్లు ఏం మాట్లాడారు, ఏ విషయాలు పంచుకున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధానిని కలిసిన తర్వాత.. టీమిండియా ఆటగాళ్లు ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. టీ20 వరల్డ్‌ కప్‌ అందుకుని.. ఒక వైపు కోచ్‌ ద్రవిడ్‌, మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో మోదీ ఫొటోలకు ఫోజులిచ్చారు. మరి ప్రధానితో మర్యాదపూర్వకంగా కలిసిన ఆటగాళ్లు, చాలా సరదాగా గడపడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments