iDreamPost

ఆ టీమ్​ను కప్పు కొట్టకుండా ఆపలేరు.. భారత మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్!

  • Published Jun 26, 2024 | 5:37 PMUpdated Jun 26, 2024 | 5:44 PM

టీ20 వరల్డ్ కప్-2024 సెమీఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. నాకౌట్ ఫైట్​లో అమీతుమీ తేల్చుకునేందుకు నాలుగు జట్లు రెడీ అయ్యాయి. ఇందులో గెలిచిన టీమ్స్ ఫైనల్ చేరతాయి.

టీ20 వరల్డ్ కప్-2024 సెమీఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. నాకౌట్ ఫైట్​లో అమీతుమీ తేల్చుకునేందుకు నాలుగు జట్లు రెడీ అయ్యాయి. ఇందులో గెలిచిన టీమ్స్ ఫైనల్ చేరతాయి.

  • Published Jun 26, 2024 | 5:37 PMUpdated Jun 26, 2024 | 5:44 PM
ఆ టీమ్​ను కప్పు కొట్టకుండా ఆపలేరు.. భారత మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్-2024 సెమీఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. నాకౌట్ ఫైట్​లో అమీతుమీ తేల్చుకునేందుకు నాలుగు జట్లు రెడీ అయ్యాయి. ఇందులో గెలిచిన టీమ్స్ ఫైనల్ చేరతాయి. ఇంగ్లండ్​తో టీమిండియా, సౌతాఫ్రికాతో ఆఫ్ఘానిస్థాన్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచెస్ కోసం ఈ టీమ్స్ ఫ్యాన్స్​తో పాటు మొత్తం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏయే జట్లు ఫైనల్​కు చేరతాయి? ఎవరి కథ సెమీస్​లో ముగుస్తుందో తెలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నారు. అన్ని టీమ్స్ కూడా విజయమే లక్ష్యంగా ఆడనున్నాయి. ఆఖరి బంతి వరకు పోరాడటం తథ్యం కాబట్టి నాకౌట్ మ్యాచ్​లు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్​ కానున్నాయి. ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిల్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సెమీస్​పై కొందరు మాజీ క్రికెటర్లు ప్రిడిక్షన్ చెప్పడం మొదలుపెట్టారు.

టీమిండియా, సౌతాఫ్రికా ఫైనల్ చేరడం ఖాయమని కొందరు మాజీలు అంటున్నారు. ఈసారి కప్పు భారత్​దేనని.. రాసిపెట్టుకోమని నమ్మకంగా చెబుతున్నారు. అయితే మెన్ ఇన్ బ్లూ మాజీ కోచ్ లాల్​చంద్ రాజ్​పుత్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ఈసారి భారత్ కాదు.. ఆఫ్ఘానిస్థాన్ విజేతగా నిలుస్తుందన్నాడు. ఆ టీమ్​ను కప్పు కొట్టకుండా ఎవరూ ఆపలేరని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పొట్టి కప్పులో నయా ఛాంపియన్​ను చూడబోతున్నామని.. అది మరెవరో కాదు, ఆఫ్ఘానిస్థాన్ అని జోస్యం పలికాడు. సెమీఫైనల్​ పోరులో వికెట్ స్లోగా ఉంటే మాత్రం సౌతాఫ్రికాను రషీద్ సేన మట్టికరిపించడం ఖాయమని చెప్పాడు. ఆఫ్ఘాన్ స్పిన్ అటాక్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు.

ఆఫ్ఘానిస్థాన్ ఈసారి విశ్వవిజేతగా నిలుస్తుందని అనుకుంటున్నా. నాకౌట్ మ్యాచ్​లో పిచ్ స్లోగా ఉంటే ఆఫ్ఘాన్​దే గెలుపు. ఆ జట్టులో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. వారిని తట్టుకొని నిలబడటం ప్రొటీస్ బ్యాటర్ల వల్ల కాదు. ఆస్ట్రేలియా మీద ఆఫ్ఘాన్ల ఆట అందరమూ చూశాం. ఆసీస్​ను రషీద్ సేన ఓడించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే గత వన్డే ప్రపంచ కప్​లో కంగారూ టీమ్​ను వాళ్లు ఓడించినంత పని చేశారు. టెస్ట్ ప్లేయింగ్ నేషన్​ అందునా వరల్డ్ ఛాంపియన్స్​ను ఓడించడం అంటే మాటలు కాదు. ఇందుకు ఆఫ్ఘాన్​ను అభినందించాలి. ఈ గెలుపుతో వాళ్లు ఫుల్ కాన్ఫిడెన్స్​తో ఉంటారు. ఇదే ఊపులో సెమీస్​లో సౌతాఫ్రికా పని పడతారని ఆశిస్తున్నా’ అని లాల్​చంద్ రాజ్​పుత్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్​పై గెలుపుతో ఆఫ్ఘాన్​లో క్రికెట్​కు మరింత ప్రజాదరణ పెరుగుతుందన్నాడు. అక్కడి యువత ఈ గేమ్​ను కెరీర్​గా ఎంచుకునేందుకు ఇక మీదట ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నాడు. మరి.. ఆఫ్ఘాన్ కప్పు గెలుస్తుందనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి