iDreamPost
android-app
ios-app

Suresh Raina: సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం..

టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Suresh Raina: సురేష్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం..

టీమిండియా మాజీ ప్లేయర్, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా ఇంట వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం 2020లో రైనా మేనమామ కుటుంబాన్ని వారి ఇంట్లోకి దూరి అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రైనా ఇంట్లో మరో విషాదం నెలకొంది. మరో మేనమాన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ నెల 1వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో గల గగల్ ఎయిర్ పోర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సురేష్ రైనా కజిన్ సౌరభ్, అతడి స్నేహితులు శుభమ్, ఖాతూమ్ లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో అదుపు తప్పిన కారు తొలుత స్కూటర్ ను ఢీకొట్టింది. అనంతరం బోల్తా పడింది. దాంతో ముగ్గురికి గాయాలు అయ్యాడు. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఇద్దరు  సౌరభ్, శుభమ్ లు గురువారం రాత్రి మృతి చెందారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రమాదం జరగగానే డ్రైవర్ పరార్ అయ్యాడు. అతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు. సీసీటీవీల ద్వారా డ్రైవర్ షేర్ సింగ్ కదలికలను గమనించి అతడిని అరెస్ట్ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడపడం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్దారణలో తెలిపారు. దాంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి