బర్త్‌డే సందర్భంగా గొప్ప మనసు చాటుకున్న గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ గురించి బహుశా ఈ తరం యువతకు అంతగా తెలిసి ఉండకపోవచ్చు. ధోని, కోహ్లీ, రోహిత్‌ శర్మ మ్యానియాలో ఊగిపోతున్న యువ క్రికెట్‌ అభిమానులకు ధోనిని గొప్ప కెప్టెన్‌గా, కోహ్లీని అగ్రెసివ్‌ ప్లేయర్‌గా, రోహిత్‌ని హిట్టర్‌గా అభిమానిస్తుంటారు. కానీ, ఆ మూడు క్వాలిటీలు కలగలిసిన పోరాట యోధుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియన్‌ క్రికెట్‌ దశాదిశను మార్చిన లీడర్‌. అందుకే అతన్ని అంతా ‘దాదా’ అని ముద్దుగా పిలుస్తుంటారు.

ఈ రోజు దాదా పుట్టిన రోజు. 52వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా గంగూలీ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. బర్త్‌డే సందర్భంగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తానని శుక్రవారం ప్రకటించిన దాదా.. ఈ రోజు ఆ విషయం ఏంటో వెల్లడించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత.. కామెంట్రీ చేస్తున్న దాదా.. రాజకీయాల్లోకి వస్తున్నాడని, అందుకే పుట్టిన రోజును పురస్కరించుకుని రాజకీయ ప్రవేశం గురించి వెల్లడిస్తాడని అంతా భావించారు.

కానీ, అన్ని ఊహాలను, అంచనాలను తలకిందులు చేస్తూ.. తన గొప్ప మనుసును చాటుకున్నాడు. ‘సౌరవ్‌ గంగూలీ మాస్టర్‌ క్లాస్‌’ పేరుతో లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ గురించి గంగూలీ స్వయంగా తన అనుభవాలను కోర్సు రూపంలో చెప్పనున్నాడు. దీనికి సంబంధించి ఒక యాప్‌ తీసుకొస్తున్నాడు. అయితే.. అందులో వచ్చే డబ్బును నిరుపేద పిల్లల చదువు కోసం ఉపయోగించనున్నాడు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు గంగూలీపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Show comments