iDreamPost
android-app
ios-app

Rohit Sharma: వీడియో: ఎయిర్​పోర్ట్​లో గజినీలా మారిన రోహిత్.. ఏం మర్చిపోయాడో తెలిస్తే నవ్వాగదు!

  • Published Jul 27, 2024 | 4:53 PMUpdated Jul 27, 2024 | 4:53 PM

Rohit-Ritika: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్​లోకి వస్తున్నాడు. శ్రీలంక సిరీస్​తో అతడు బరిలోకి అడుగుపెట్టి బ్యాట్​తో మాయాజాలం చేయనున్నాడు.

Rohit-Ritika: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్​లోకి వస్తున్నాడు. శ్రీలంక సిరీస్​తో అతడు బరిలోకి అడుగుపెట్టి బ్యాట్​తో మాయాజాలం చేయనున్నాడు.

  • Published Jul 27, 2024 | 4:53 PMUpdated Jul 27, 2024 | 4:53 PM
Rohit Sharma: వీడియో: ఎయిర్​పోర్ట్​లో గజినీలా మారిన రోహిత్.. ఏం మర్చిపోయాడో తెలిస్తే నవ్వాగదు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మతిమరుపు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో సార్లు ఇది ప్రూవ్ అయింది. రియల్ లైఫ్​లోనే కాదు.. ప్రొఫెషనల్ లైఫ్​లోనూ తన మతిమరుపుతో పలుమార్లు వార్తల్లో నిలిచాడు హిట్​మ్యాన్. ఒకసారి న్యూజిలాండ్​తో మ్యాచ్ సమయంలో టాస్​కు వెళ్లి ప్లేయింగ్ ఎలెవన్​ గురించి మర్చిపోయాడు. టీమ్​లోకి వచ్చిన కొత్త ప్లేయర్లు ఎవరు? తీసేసిన వాళ్లెవరో మర్చిపోవడంతో లైవ్​లోనే ఇబ్బంది పడ్డాడు. ఇది చూసి కామెంటేటర్, కివీస్ కెప్టెన్ సహా అభిమానులు కూడా నవ్వుల్లో మునిగిపోయారు. క్రికెట్ మ్యాచ్​లతో ఎప్పుడూ బిజీగా ఉండే భారత సారథి హోటల్ రూమ్స్​లో ఫోన్లు, పాస్​పోర్ట్ మర్చిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

రోహిత్ మతిమరుపు గురించి ఇతర ఆటగాళ్లు షేర్ చేసిన విషయాలు వింటే నవ్వాగదు. ఇప్పుడు మరోమారు గజినీలా మారాడతను. భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో కలసి ముంబై ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్ అయ్యాడు హిట్​మ్యాన్. బయటికొచ్చి మీడియా వాళ్లను కలిశాక కారు ఎక్కి వెళ్లిపోబోయాడు. అయితే ఇంటికి త్వరగా వెళ్లాలనే కంగారులో ఏకంగా తన బ్యాగులను మర్చిపోయాడు. కారు ఎక్కాక ఈ విషయం గుర్తుకురావడంతో తన సిబ్బందిని పిలిచి బ్యాగుల్ని తీసుకురావాలని చెప్పాడు. దీంతో కారులో హిట్​మ్యాన్ పక్కనే ఉన్న అతడి సతీమణి రితికా షాకైంది. బ్యాగులు మర్చిపోవడం ఏంటంటూ డిఫరెంట్ రియాక్షన్ ఇచ్చింది.

సిబ్బందిని బ్యాగులు తీసుకురమ్మని ఆదేశించి రోహిత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ మొత్తం ఘటన మీడియా కెమెరాల్లో రికార్డ్ అవడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. ఇంత మతిమరుపు ఏంటి భయ్యా అని అంటున్నారు. ఇక, ముంబైకి చేరుకున్న హిట్​మ్యాన్.. ఒకట్రెండు రోజుల్లో శ్రీలంకకు బయల్దేరనున్నాడు. ఆ టీమ్​తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. అందుకే జట్టులోని ఇతర ఆటగాళ్లతో కలసి సిరీస్ కోసం బయల్దేరనున్నాడు రోహిత్. టీ20 వరల్డ్ కప్​ తర్వాత అతడు ఆడబోయే తొలి సిరీస్ ఇదే కానుంది. వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్​లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. కాబట్టి ఇక మీదట ఆడే వన్డే మ్యాచులు టీమ్​కు చాలా కీలకంగా మారనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి