iDreamPost
android-app
ios-app

వీడియో: ఇషాన్‌ కిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్‌! ఎందుకంటే?

  • Published Jul 15, 2023 | 2:27 PM Updated Updated Jul 15, 2023 | 2:27 PM
  • Published Jul 15, 2023 | 2:27 PMUpdated Jul 15, 2023 | 2:27 PM
వీడియో: ఇషాన్‌ కిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్‌! ఎందుకంటే?

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌పై అసహనం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌ను తొలి రోజే 150 పరుగులకు ఆలౌట్‌ చేసి మ్యాచ్‌పై పట్టుబిగించిన రోహిత్‌ సేన.. బ్యాటింగ్‌లోనూ భారీ స్కోర్‌ చేసి అదరగొట్టింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(103), యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. అయితే.. మూడో రోజు ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేద్దామని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భావించాడు. జట్టు స్కోర్‌ 400 దాటిన తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆగాడు.

కానీ, టీమిండియా సీనియర్‌ స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీకి దగ్గరవ్వడంతో అతను సెంచరీ చేసిన తర్వాత డిక్లేర్‌ చేద్దామనుకుంటే.. కోహ్లీ 76 పరుగుల వద్ద అవుట్‌ అయ్యాడు. సరే కోహ్లీ అవుట్‌ అయిన వెంటనే డిక్లేర్‌ చేసేద్దామని డ్రెస్సింగ్‌ రూమ్‌ కెప్టెన్‌, కోచ్‌ నిర్ణయం తీసుకోగా.. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ వెళ్లి ఒక రన్‌ అయినా చేసి ఖాతా తెరిచిన తర్వాత డిక్లేర్‌ చేద్దామ్‌ లే.. ఫస్ట్‌ టెస్ట్‌ ఆడుతున్న ఇషాన్‌ను ఎందుకు నిరాశపర్చడం, మళ్లీ ఇండియాకు రెండో ఇన్నింగ్స్‌ ఆడే ఛాన్స్‌ ఉండకపోవచ్చు అని రోహిత్‌ భావించి.. కోహ్లీ అవుటైన తర్వాత ఇషాన్‌ను బ్యాటింగ్‌ దింపాడు.

బ్యాటింగ్‌కు వెళ్లిన ఇషాన్‌ కిషన్‌ మాత్రం నెమ్మదిగా ఆడుతూ.. పరుగులు చేయడం లేదు. అప్పటికే టీమిండియా స్కోర్‌ 400 దాటేసింది. ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి, వెస్టిండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌ ఆడించి, వీలైనంత త్వరగా ఆలౌట్‌ చేసిన మ్యాచ్‌ ముగిద్దాం అనుకుంటే.. ఇషాన్‌ 19 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయలేదు. ఇషాన్‌ జిడ్డు బ్యాటింగ్‌తో అసహనానికి గురైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఫీల్డింగ్‌ కోసం రెడీ అయిపోయి.. క్రీజ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ వైపు చూస్తూ.. ఏం ఆడుతున్నావ్‌? ఒక్క రన్‌ చేయడానికి ఇంతసేపా అంటూ అసహనం వ్యక్తం చేశాడు. రోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

అయితే.. ఇషాన్‌ కిషన్‌ ఒక్కడే నిదానంగా ఆడలేదు. పిచ్‌ స్లోగా ఉండటంతో ప్రతి బ్యాటర్‌ కూడా టైమ్‌ తీసుకునే పరుగులు చేశారు. 171 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ సైతం ఆరంభంలో చాలా టైమ్‌ తీసుకున్నాడు. అలాగే మంచి నీళ్లు తాగినంత సులువుగా బౌండరీలు బాదే విరాట్‌ కోహ్లీ సైతం 81వ బంతికి తొలి ఫోర్‌ కొట్టాడు. ఇక నిదానంగా ఆడటం అంటే చిరాకు పడే రోహిత్‌ శర్మ కూడా 103 పరుగులు చేయడానికి 221 బంతులు తీసుకున్నాడు. కానీ, ఫస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌పై మాత్రం అసహనం వ్యక్తం చేశాడంటూ క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: గ్రౌండ్‌లో పడుకున్న కోహ్లీ! అలా ఎందుకు చేశాడంటే?