Gambhir Convinced Rohit Play In Duleep Trophy: దులీప్ ట్రోఫీలో ఆడనున్న రోహిత్! గంభీర్​ మాటకు ఎలా ఎస్ చెప్పాడు?

Rohit-Gambhir: దులీప్ ట్రోఫీలో ఆడనున్న రోహిత్! గంభీర్​ మాటకు ఎలా ఎస్ చెప్పాడు?

Team India: టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్​లు లేవు. బంగ్లాదేశ్​తో సిరీస్​కు ఇంకా చాలా టైమ్ ఉంది. దీంతో కొందరు ఆటగాళ్లు వెకేషన్స్​లో బిజీగా ఉన్నారు. ఇంకొందరు ఇంటి పట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.

Team India: టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్​లు లేవు. బంగ్లాదేశ్​తో సిరీస్​కు ఇంకా చాలా టైమ్ ఉంది. దీంతో కొందరు ఆటగాళ్లు వెకేషన్స్​లో బిజీగా ఉన్నారు. ఇంకొందరు ఇంటి పట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.

టీమిండియాకు ప్రస్తుతం మ్యాచ్​లు లేవు. దీంతో కొందరు ఆటగాళ్లు వెకేషన్స్​లో బిజీగా ఉన్నారు. భార్య, పిల్లలతో కలసి టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లోని అందమైన ప్రదేశాలను చుట్టేసి వస్తున్నారు. ఇంకొందరు ప్లేయర్లు ఇంటి పట్టునే విశ్రాంతి తీసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్​, శ్రీలంక టూర్​లో ఆడి సీనియర్ క్రికెటర్లు అలసిపోయారు. జూనియర్లది కూడా ఇదే పరిస్థితి. అందుకే మధ్యలో భారీ గ్యాప్ వచ్చేలా ముందే బీసీసీఐ ప్లాన్ చేసింది. భారత్ తన తదుపరి సిరీస్​ను సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్​తో ఆడనుంది. ఇంకా దీనికి నెలకు పైనే సమయం ఉంది. అయితే ఈ మధ్యలో బోర్డు ఆటగాళ్లను ఒక టోర్నీ బరిలోకి దింపుతోంది.

శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఇష్యూ కారణంగా నేషనల్ డ్యూటీ లేని సమయంలో ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలంటూ భారత బోర్డు ఆ మధ్య రూల్ తీసుకొచ్చిన సంగతి తెలిసింది. దాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 5 నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీలో ఆడాల్సిందిగా శుబ్​మన్ గిల్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్​ను బోర్డు ఆదేశించింది. వీళ్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా ఈ టోర్నీలో ఆడించాలని అనుకుంటోంది బోర్డు. ఆల్రెడీ వాళ్లకు ఇండికేషన్స్ ఇచ్చిందట. దులీప్ ట్రోఫీ బరిలోకి రోకో జోడీ దిగడమే ఆలస్యమని బీసీసీఐ వర్గాల సమాచారం. అయితే 8 ఏళ్లుగా ఈ టోర్నీతో పాటు డొమెస్టిక్ క్రికెట్​కు దూరంగా ఉంటున్న హిట్​మ్యాన్​ను కొత్త కోచ్ గంభీర్-బోర్డు కలసి ఎలా ఒప్పించాయి? అనేది ఆసక్తికరంగా మారింది.

రోహిత్​, కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడటం ఎప్పుడో మానేశారు. చివరగా దులీప్ ట్రోఫీ-2016లో హిట్​మ్యాన్ పాల్గొనగా.. కింగ్ దేశవాళీ మ్యాచ్​లు ఆడి దశాబ్ద కాలం దాటింది. ఒకవైపు అంతర్జాతీయ మ్యాచ్​లు, మరోవైపు ఐపీఎల్​తో బిజీగా ఉండే ఈ స్టార్లు.. మధ్యలో ఫామ్ కోల్పోయిన టైమ్​లో డొమెస్టిక్ సైడ్ రమ్మని కోరినా రాలేదు. అలాంటి దిగ్గజాలను దులీప్ ట్రోఫీలో ఆడేలా అంత ఈజీగా గంభీర్ ఎలా ఒప్పించాడని అంతా తలలు పట్టుకుంటున్నారు. అయితే ఫామ్​ను మెరుగుపర్చుకోవడం, ఫిట్​నెస్​ను కాపాడుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకం కావడం, ఇకపై టెస్టుల్లోనే ఎక్కువగా ఆడాల్సి ఉండటంతో దులీప్ ట్రోఫీలో ఆడాలంటూ గంభీర్ చేసిన సూచనను రోహిత్-కోహ్లీ కాదనలేకపోయారని తెలుస్తోంది. గౌతీతో పాటు బోర్డు పెద్దలు కూడా ఈ లెజెండ్స్​ను కన్విన్స్ చేశారని సమాచారం. ఇంటర్నేషనల్ డ్యూటీ లేని టైమ్​లో డొమెస్టిక్​లో ఆడాలనే రూల్​ను స్ట్రిక్ట్​గా ఇంప్లిమెంట్ చేయాలని ఫిక్స్ అయింది బోర్డు. రోహిత్, కోహ్లీ నుంచే ఈ రూల్​ను అమల్లోకి తీసుకొచ్చేందుకు ఈ విధంగా ప్లాన్ చేశారని వినిపిస్తోంది.

Show comments