నేలమట్టం కానున్న న్యూయార్క్ స్టేడియం! 250 కోట్ల ఖర్చు పెట్టినా నో యూజ్!

New York Cricket Stadium May Demolished: న్యూయార్క్ సిటీలోని నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.250 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఆ స్టేడియాన్ని అసలు ఎందుకు కూల్చేస్తున్నారు?

New York Cricket Stadium May Demolished: న్యూయార్క్ సిటీలోని నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని కూల్చివేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.250 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఆ స్టేడియాన్ని అసలు ఎందుకు కూల్చేస్తున్నారు?

పొట్టి ప్రపంచ కప్ 2024 జోరుగా సాగుతోంది. ఇప్పటికే దాదాపుగా సగం టోర్నమెంట్ ముగిసింది. మ్యాచుల్లో టీమిండియా దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ మొత్తంలో మ్యాచుల గురించి, విజయాల గురించి పక్కన పెడితే అంతా కూడా ఒకే విషయం గురించి బాగా మాట్లాడుకున్నారు. అదేంటంటే.. నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఈ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఈ న్యూయార్క్ స్టేడియంలోనే లోయస్ట్ టోటర్స్ నమోదు అయ్యాయి. అంతా పిచ్ గురించే మాట్లాడుకున్నారు. అయితే అలాంటి స్టేడియాన్ని నేలమట్టం చేస్తున్నారు అంటున్నారు.

ఈ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో ఎక్కువగా చర్చ జరిగింది ఏదైనా ఉంది అంటే.. అది నస్సావ్ కౌంటీ స్టేడియం గురించే అని చెప్పాలి. ఎందుకంటే క్రికెట్ దిగ్గజాలు, హేమాహేమీలకు కూడా ఆ పిచ్ స్వభావం ఏంటో అర్థం కాలేదు. అసలు ఆ పిచ్ బ్యాటింగ్ కి సహకరిస్తుందా? బౌలింగ్ కి సహకరిస్తుందా? ఎలాంటి సమయంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అనే విషయాన్ని నిపుణులు కూడా అంచనా వేసే పరిస్థితి కనిపించలేదు. అన్నింటికీ మించి.. ఆ స్టేడియంలో జరిగిన అన్నీ మ్యాచుల్లో అత్యల్ప స్కోరే నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురించి చేసింది. వరల్డ్ బెస్ట్ టీమ్స్ కూడా ఆ స్టేడియంలో కనీసం 150 పరుగులు చేయలేకపోయారు అంటేనే అర్థం చేసుకోవాలి.

250 కోట్ల ఖర్చు.. 3 నెలల్లో నిర్మాణం:

టీ20 ప్రపంచకప్ అమెరికాలో నిర్వహిస్తున్న అన్న రోజు నుంచి ఈ నస్సావ్ కౌంటీ న్యూయార్క్ స్టేడియం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎందుకంటే ఆ స్టేడియాన్ని కేవలం 3 నెలల్లోనే పూర్తి చేశారు. ఆ నిర్మాణానికి సంబంధించిన వీడియోలు, అప్ డేట్స్ అన్నీ సోషల్ మీడియాని షేక్ చేశాయి. అంతేకాకుండా.. ఈ స్టేడియం నిర్మాణం కోసం ఏకంగా రూ.250 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ప్రతి విషయంలో ఈ స్టేడియం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్ గా నిలిచింది. అయితే మ్యాచులు స్టార్ట్ అయ్యాక మాత్రం నెగిటివ్ గానే ఎక్కువ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ స్టేడియాన్ని కూల్చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

కూల్చివేత:

ప్రస్తుతం న్యూయార్క్ స్టేడియాన్ని కూల్చేస్తున్నారు అనే వార్త బాగా వైరల్ అవుతోంది. బుధవారం టీమిండియా- అమెరికా జట్ల మధ్య జరిగేదే ఆ స్టేడియంలో ఆఖరి మ్యాచ్ అంటూ ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే రూ.250 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన స్టేడియాన్ని ఎందుకు కూల్చేస్తున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ స్టేడియానికి సంబంధించి వచ్చిన నెగిటివిటీనే దానికి కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా పిచ్ లను ఎలాగోలా మార్చుకోవచ్చు. కానీ, అవుట్ ఫీల్డ్ కూడా చాలా మందకొండిగా ఉంది. కాబట్టి స్టేడియం మొత్తాన్ని మార్చడ కష్టం కాబట్టి.. కూల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో కేవలం టీమిండియా- పాక్ మ్యాచ్ కే రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. కాబట్టి ఎలాంటి నష్టాలు వచ్చే ఛాన్స్ లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. న్యూయార్క్ స్టేడియాన్న కూల్చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments