IND vs PAK మ్యాచ్‌ చూసి చనిపోయిన ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు!

Mumbai Cricket Association, Amol Kale, New York, IND vs PAK: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాకిస్థాన్‌పై ఇండియా విజయంతో సంతోషంలో ఉన్న భారత క్రికెట్‌కు విషాదకరమైన వార్త అందించింది. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు న్యూయార్క్‌లో మరణించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Mumbai Cricket Association, Amol Kale, New York, IND vs PAK: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాకిస్థాన్‌పై ఇండియా విజయంతో సంతోషంలో ఉన్న భారత క్రికెట్‌కు విషాదకరమైన వార్త అందించింది. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు న్యూయార్క్‌లో మరణించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా ఇండియా-పాకిస్థాన్‌ మధ్య ఆదివారం(జూన్‌ 9) మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో చూసిన ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే న్యూయార్క్‌లోనే కన్నుమూశారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆయన కార్డియాక్‌ అరెస్ట్‌(గుండెపోటు)కు గురయ్యారు. ఎంసీఏ కార్యదర్శి అజింక్యా నాయక్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సూరజ్ సమత్‌తో కలిసి ఆయన ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను లైవ్‌ చూశారు.

ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌కు ఎంతో సేవ చేసిన అమోల్‌ కాలే ఆకస్మిక మరణంతో ముంబై క్రికెట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. టీమిండియాకు ఎంతో మంది గొప్ప గొప్ప క్రికెటర్లను అందించిన చరిత్ర ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌కు ఉంది. ఇండియన్‌ క్రికెట్‌ అంటే ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అనే పేరుంది. అలాంటి గొప్ప క్రికెట్‌ బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్న అమోల్‌.. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ గౌరవాన్ని, దాని వారసత్వాన్ని అద్భుతంగా ముందుకు నడిపించారనే పేరుంది. అలాంటి వ్యక్తి.. హఠాన్మరణంపై మాజీ క్రికెటర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆయన మృతదేహాన్ని న్యూయార్క్‌ నుంచి ఇండియాకు తీసుకురానున్నారు. ఆ ఏర్పాట్లను ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌తో పాటు బీసీసీఐ కూడా చూసుకుంటోంది. 2021 అక్టోబర్‌ 21న ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు

Show comments