SNP
SNP
పాకిస్థాన్ బౌలర్లపై టీమిండియా బ్యాటర్లు విరుచుకుపడ్డారు. కేఎల్ రాహుల్- విరాట్ కోహ్లీ సెంచరీలతో పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. ఆదివారం 24.1 ఓవర్లు ఆడిన టీమిండియా.. వర్షం రావడంతో ఇవాళ రిజర్వ్ డేలో అక్కడి నుంచే మ్యాచ్ కొనసాగించి అదే ఊపుతో ఆడింది. తొలుత టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శుబ్మన్ గిల్ అద్భుత ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని అవుట్ అయ్యారు. ఆ తర్వాత కోహ్లీ-కేఎల్ కొద్ది సేపు నిదానంగా ఆడినా.. ఈ రోజు చెలరేగిపోయారు.
కేఎల్ రాహుల్ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా దూరమైన రాహుల్ దాదాపు 6 నెలల గ్యాప్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. చాలా కాలం తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్లోనే అద్భుత సెంచరీతో చెలరేగడంతో అతని ఆత్మవిశ్వాసం మరింత పెరగనుంది. పైగా సెంచరీ చేసింది పాకిస్థాన్పై కావడంతో మరింత స్పెషల్ కానుంది. వన్డే వరల్డ్ కప్ ముందు టీమిండియా కోర్ టీమ్ మొత్తం ఇలా సెట్ రైట్ అవుతుండటంపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
మొత్తం మీద కేఎల్ రాహుల్ 100 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. సూపర్ 4 దశలో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రిజర్వ్ డేలో జరుగుతుంది. ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కీలకమైన సూపర్ 4 మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే కేటాయించారు. అయినా కూడా ఈ రోజు మ్యాచ్ దీంతో ఇవాళ మ్యాచ్ కాస్త ఆలస్యంగా ఆరంభం అయింది. ఆదివారం 24.1 ఓవర్లు ఆడి 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి టీమిండియా.. ఈ రోజు అక్కడి నుంచే మ్యాచ్ను మొదలుపెట్టింది. మరి టీమిండియా స్టార్ ప్లేయర్లు కోహ్లీ-రాహుల్ సెంచరీలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.