Josh Hazlewood: టీమిండియాకు హేజల్​వుడ్ వార్నింగ్! ఈసారి కథ వేరేలా ఉంటుందంటూ..!

Josh Hazlewood Warns Team India: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్​ హేజల్​వుడ్ టీమిండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నాడు. ఈసారి కథ వేరేలా ఉంటుందన్నాడు.

Josh Hazlewood Warns Team India: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్​ హేజల్​వుడ్ టీమిండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నాడు. ఈసారి కథ వేరేలా ఉంటుందన్నాడు.

ఆస్ట్రేలియా.. ఈ పేరు చెబితేనే అన్ని క్రికెటింగ్ నేషన్స్ భయపడతాయి. గత పాతికేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్​లో ఆ టీమ్ నడిపిస్తున్న హవా అలాంటిది. మేజర్ ఐసీసీ ట్రోఫీలను ఎగరేసుకుపోవడం కంగారూలకు అలవాటుగా మారింది. ఇంక ఆ దేశంలో పర్యటించే జట్లు ఖాళీ చేతులతో తిరిగి రావడం ఆనవాయితీగా మారింది. పరాయి గడ్డపై ఇరగదీసే ఆసీస్.. సొంతగడ్డపై బెబ్బులిలా విజృంభించి ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడిస్తుంది. అయితే అందర్నీ భయపెట్టే కంగారూలు.. ఇప్పుడు భారత్​కు భయపడుతున్నారు. మన టీమ్ పేరు చెబితేనే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆస్ట్రేలియా సీనియర్లతో పాటు ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు కూడా మన మీద కారాలు మీరాలు నూరుతున్నారు. ఆ టీమ్ స్టార్ పేసర్ జోష్​ హేజల్​వుడ్ టీమిండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నాడు. ఈసారి కథ వేరేలా ఉంటుందన్నాడు.

ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిత్ సేనను విడిచిపెట్టబోమని హెచ్చరిస్తున్నాడు హేజల్​వుడ్. ఆ ట్రోఫీని ఎగరేసుకుపోతామని అంటున్నాడు. ఈ పేసర్ మాట్లాడుతోంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి. ఈ ఏడాది ఆఖర్లో ఈ సిరీస్​లో భాగంగా ఆసీస్​కు పయనం కానున్నారు భారత ఆటగాళ్లు. గత రెండు పర్యటనల్లో కంగారూలను ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఈసారి కూడా ఆసీస్​ను వాళ్ల సొంతగడ్డపై మరోమారు చిత్తు చేసి తమ డామినేషన్​ను గట్టిగా చాటి చెప్పాలని భారత్ భావిస్తోంది. అయితే సిరీస్​కు ఇంకా చాలా టైమ్ ఉన్నా కంగారూలు మాత్రం ఫుల్​గా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటి నుంచే మాటల తూటాలు పేల్చుతున్నారు. అందులో భాగంగానే హేజల్​వుడ్ మెన్ ఇన్ బ్లూకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తమదేనని బల్ల గుద్ది చెప్పాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..

‘టీమిండియాతో తలపడటం ఎప్పుడూ ఛాలెంజింగ్​గానే ఉంటుంది. మా అత్యంత బలమైన శత్రువు ఆ జట్టే. ఆస్ట్రేలియా కండీషన్స్ గురించి భారత ఆటగాళ్లకు బాగా తెలుసు. ఇక్కడ అదరగొట్టాలని వాళ్లు ఉవ్విళ్లూరుతుంటారు. వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. టాప్-7 ప్లేయర్లు చాలా సాలిడ్​గా ఉన్నారు. మా టీమ్ కూడా దుర్భేద్యంగా ఉంది. గెలుపు కోసం మేం చాలా ఆకలిగా ఉన్నాం. ఈసారి కాంపిటీషన్ హైలెవల్​లో ఉండబోతోంది. మేం తప్పకుండా నెగ్గుతాం’ అని హేజల్​వుడ్ స్పష్టం చేశాడు. ఈ మధ్య కాలంలో భారత్​ మీద సిరీస్​ గెలవని మాట వాస్తవమేనని.. కానీ ఈసారి లెక్క మారుస్తామన్నాడు ఆసీస్ పేసర్. ఇక, 2014లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు హేజల్​వుడ్. అప్పటి నుంచి ఇప్పటివరకు టీమిండియాతో ఆడిన ఒక్క టెస్ట్ సిరీస్​ను కూడా ఆసీస్ గెలుచుకోలేదు. అందుకే తాము ఆకలితో ఉన్నామని అన్నాడతను. మరి.. టీమిండియాను ఈసారి ఓడిస్తామంటూ హేజల్​వుడ్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments