SNP
SNP
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్న క్రికెట్ పోటీల్లో భారత పురుషుల జట్టు పాల్గొననుంది. అలాగే మహిళల జట్టకు హర్మన్ ప్రీత్ కెప్టెన్గా వ్యవహరిస్తుంది. మహిళా క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు జరగనున్నాయి. ఈ పోటీలు టీ20 ఫార్మాట్లో జరుగుతాయి.
పురుషుల జట్టుకు మొదట సీనియర్ క్రికెట్ శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా రుతురాజ్ను బీసీసీఐ కెప్టెన్గా ఎంపిక చేసింది. ఇక జట్టులో ప్రస్తుతం వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో సెంచరీతో దుమ్మరేపిన యశస్వి జైస్వాల్తో పాటు ఐపీఎల్లో అదరగొట్టిన రింకూ సింగ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, జితేష్ శర్మలకు చోటు దక్కింది. వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమ్లో వీరికి స్థానం కల్పించలేదని క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి ఆ తప్పు చేయకుండా ఆసియా గేమ్స్ కోసం వీరిని బీసీసీఐ ఎంపిక చేసింది.
ఆసియా గేమ్స్లో పాల్గొనబోయే భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివం మావి, శివం దూబే, ప్రభసిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్). స్టాండ్బై ప్లేయర్స్.. యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ ఉన్నారు.
NEWS 🚨- Team India (Senior Men) squad for 19th Asian Games: Ruturaj Gaikwad (Captain), Yashasvi Jaiswal, Rahul Tripathi, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Washington Sundar, Shahbaz Ahmed, Ravi Bishnoi, Avesh Khan, Arshdeep Singh, Mukesh Kumar, Shivam Mavi, Shivam…
— BCCI (@BCCI) July 14, 2023
ఇదీ చదవండి: యశస్వీ సెంచరీ ఇన్నింగ్స్.. ఎవరికి అంకితం చేశాడో తెలుసా?