SNP
SNP
వెస్టిండీస్తో గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. గతమెంతో ఘనమైన వెస్టిండీస్.. ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే. కనీసం వన్డే వరల్డ్ కప్కు క్వాలిఫై కూడా కాలేని దయనీయ స్థితికి చేరింది. అలాంటి జట్టుపై వరల్డ్ కప్ ఫేవరేట్స్లో ఒకటైన టీమిండియా సాధించిన విజయం చూసి.. భారత క్రికెట్ అభిమానులు, క్రికెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టీమ్తో వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను ఎదుర్కొని వరల్డ్ కప్ గెలుస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి భయానికి కారణం ఏంటంటే?
నిన్నటి మ్యాచ్లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. టెస్టు టీమ్ కంటే కాస్త బెటర్గా వన్డే టీమ్ ఉన్నా. టీమిండియా స్పిన్ మ్యాజిక్ ముందు విండీస్ బ్యాటర్లు నిలువలేకపోయారు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెలరేగడంతో కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది కరేబియన్ జట్టు. భారత బౌలర్ల దెబ్బకి వన్డే మ్యాచ్ కాస్తా.. టీ20 మ్యాచ్లా మారిపోయింది. ఎందుకంటే విండీస్ 23 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. అలాగే టీమిండియాకు ఇచ్చినా టార్గెట్ కూడా చాలా చిన్నది కావడంతో.. టీమిండియా బ్యాటర్లు కూడా టీ20 స్టైల్లోనే మ్యాచ్ను ముగిస్తారని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మ వెరేలా ఆలోచించాడు.
వన్డే వరల్డ్ కప్ కోసం టీమ్ను రెడీ చేస్తున్న తరుణంలో జట్టులోని యువ క్రికెటర్లకు, జట్టుకు కొంతకాలంగా దూరంగా వారికి గేమ్ టైమ్ను ఇవ్వాలని భావించాడు. దాని కోసం తన ఓపెనింగ్ స్పాట్ను త్యాగం చేసి, విరాట్ కోహ్లీని కూడా వన్డౌన్లో దింపలేదు. వారి స్థానాల్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లకు ఆడే అవకాశం ఇచ్చాడు. వీరిలో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో పర్వాలేదని పించినా.. మరో ఓపెనర్ గిల్ దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో రోహిత్కు జోడీగా గిల్ బంధం తేగిపోయే ప్రమాదంలో పడింది. ఇషాన్ కిషన్తో అయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా కుదురుతుంది. ఇషాన్ విషయం పక్కనపెడితే..
శుబ్మన్ గిల్ ప్రస్తుతం ఫామ్లో లేడనే చెప్పాలి. టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్ల్లోనూ పరుగుల చేయలేదు. అలాగే కోహ్లీ స్థానంలో వన్డౌన్లో వచ్చిన సూర్య సైతం ఒకటీ అర షాట్లు తప్పించి పెద్దగా ఆడలేదు. కేవలం 25 బంతుల్లో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే వన్డే టీమ్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దురదృష్టవశాత్తు అన్లక్కీగా అవుటైనా.. అతను కూడా 5 పరుగులే చేశాడు. ఇక శార్దుల్ ఠాకూర్ కూడా ఒక్క పరుగే చేసి దారుణంగా నిరాశపరిచాడు. ఏ మాత్రం పసలేని విండీస్ బౌలింగ్లో కేవలం 115 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు చివర్లో రోహిత్ శర్మ కూడా 7వ స్థానంలో బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది.
జడేజా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే విరాట్ కోహ్లీ కూడా 8వ స్థానంలో ఆడాల్సిన దుస్థితి వచ్చింది. తక్కువ స్కోర్ ఉంది కదా యువ క్రికెటర్లకు అవకాశం ఇద్దామని రోహిత్, కోహ్లీ భావిస్తే.. టీమ్ మొత్తం వారిని దారుణంగా నిరాశపర్చింది. కోహ్లీ, రోహిత్ టీమ్లో లేకపోయినా, లేదా వాళ్లిద్దరూ సరిగా ఆడకపోయినా.. టీమిండియా ఓ పసికూన టీమ్లా తయారైందని క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. వారిద్దరి తర్వాత కొద్దో గొప్పో జడేజా పర్వాలేదనిపిస్తున్నాడు. ఇలాంటి టీమ్ను నమ్ముకుని టీమిండియా అక్టోబర్లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్లో ఏమేర రాణిస్తుందోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్లో కూడా దురదృష్టవశాత్తు కీలకమైన మ్యాచ్లో కోహ్లీ, రోహిత్ విఫలమైతే టీమిండియా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Today we saw that Indian batting is nothing without Virat Kohli. We won’t be able to qualify even for WC ko’s without him pic.twitter.com/rDj93c3YWZ
— leisha (@katyxkohli17) July 27, 2023
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ అంత గొప్పోడా? ఆసక్తికర లెక్కలు వెలుగులోకి..