iDreamPost
android-app
ios-app

Rinku Singh: చరిత్ర సృష్టించిన రింకూ సింగ్.. ఏకంగా కోహ్లీ రికార్డుకు ఎసరు!

  • Published Jul 08, 2024 | 6:20 PM Updated Updated Jul 08, 2024 | 6:20 PM

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపులో ఫినిషర్ రింకూ సింగ్​కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఆఖర్లో అతడు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఉరుములా విరుచుకుపడ్డాడు.

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపులో ఫినిషర్ రింకూ సింగ్​కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఆఖర్లో అతడు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఉరుములా విరుచుకుపడ్డాడు.

  • Published Jul 08, 2024 | 6:20 PMUpdated Jul 08, 2024 | 6:20 PM
Rinku Singh: చరిత్ర సృష్టించిన రింకూ సింగ్.. ఏకంగా కోహ్లీ రికార్డుకు ఎసరు!

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపులో ఫినిషర్ రింకూ సింగ్​కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఆఖర్లో అతడు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఉరుములా విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్​లో 22 బంతులు ఎదుర్కొన్న అతడు.. 48 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. రింకూ ఇన్నింగ్స్​లో 2 బౌండరీలతో పాటు ఏకంగా 5 భారీ సిక్సులు ఉన్నాయి. అతడు కొట్టిన ఓ షాట్​కు బాల్ వెళ్లి స్టేడియం అవతల చెట్ల పొదల్లో పడింది. దీన్ని బట్టే ఈ పించ్ హిట్టర్ ఇన్నింగ్స్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 218 స్ట్రయిక్ రేట్​తో బ్యాటింగ్ చేస్తూ జింబాబ్వే బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు రింకూ. తొలి మ్యాచ్​లో ఓటమి, తాను కూడా డకౌట్​గా వెనుదిరగడంతో కోపంతో ఉన్న అతడు.. దాన్ని అపోజిషన్ బౌలర్లపై చూపించాడు.

రింకూకు తోడుగా రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్) కూడా రెచ్చిపోవడంతో భారత్​ 234 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన జింబాబ్వే 134 పరుగులకే కుప్పకూలింది. ఇక, ఈ మ్యాచ్​తో రింకూ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని లాంటి లెజెండరీ క్రికెటర్ల సరసన చేరాడు. టీ20 క్రికెట్​లో ఆఖరి రెండు ఓవర్లలో అత్యధిక సిక్సులు కొట్టిన భారతీయ బ్యాటర్లలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు రింకూ. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా (193 బంతుల్లో 32 సిక్సులు) ఈ లిస్ట్​లో ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. అతడి తర్వాత స్థానాల్లో వరుసగా కోహ్లీ (158 బంతుల్లో 24 సిక్సులు), ధోని (258 బంతుల్లో 19 సిక్సులు) ఉన్నారు. ఇందులో రింకూ (48 బంతుల్లో 17 సిక్సులు) నాలుగో స్థానంలో నిలిచాడు.

చివరి రెండు ఓవర్లలో అత్యధిక సిక్సులు కొట్టిన భారతీయుల జాబితాలో టాప్​లో ఉన్న హార్దిక్ 32 సిక్సులు కొట్టేందుకు 193 బంతులు తీసుకున్నాడు. కానీ ఫోర్త్ ప్లేస్​లో ఉన్న రింకూ 48 బంతుల్లో 17 సిక్సర్లు బాదేశాడు. ఇంకో 8 సిక్సులు కొడితే కోహ్లీని అతడు అధిగమిస్తాడు. అతడి ఊపు చూస్తుంటే విరాట్, హార్దిక్​తో పాటు ఈ లిస్ట్​లో ముందంజలో ఉన్న ఇతర టీమ్ బ్యాటర్స్​ను కూడా ఈజీగా దాటేస్తాడని మాజీ క్రికెటర్లు, ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఇంత తక్కువ టైమ్​లో కోహ్లీ, ధోని లాంటి గ్రేట్ ప్లేయర్స్ సరసన చోటు దక్కించుకోవడం అంటే మాటలు కాదని.. ఇది రింకూ ప్రతిభకు నిదర్శనమని చెబుతున్నారు. అతడు ఇదే జోరును కొనసాగించాలని.. ఈ పించ్​ హిట్టర్​ను ఆపడం ఎవరి వల్లా కాదని నమ్మకంగా చెబుతున్నారు. మరి.. కోహ్లీ, హార్దిక్​ను దాటి రింకూ ఆల్​టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş