3 Reasons For India Loss To Sri Lanka: లంకతో మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు!

IND vs SL: లంకతో మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు!

టీమిండియా మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లంకతో జరిగిన మూడో వన్డేలో ఓడి సిరీస్​ను పోగొట్టుకుంది. ఈ మధ్య కాలంలో మన జట్టు ఇంత చెత్తగా ఆడటం ఇదే ఫస్ట్ టైమ్.

టీమిండియా మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లంకతో జరిగిన మూడో వన్డేలో ఓడి సిరీస్​ను పోగొట్టుకుంది. ఈ మధ్య కాలంలో మన జట్టు ఇంత చెత్తగా ఆడటం ఇదే ఫస్ట్ టైమ్.

టీమిండియా మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లంకతో జరిగిన మూడో వన్డేలో ఓడి సిరీస్​ను పోగొట్టుకుంది. ఈ మధ్య కాలంలో మన జట్టు ఇంత చెత్తగా ఆడటం ఇదే ఫస్ట్ టైమ్. ఇవాళ్టి మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆతిథ్య జట్టు అన్ని ఓవర్లు ఆడి 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. తొమ్మిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉండటంతో ఈ స్కోరును భారత్ ఛేజ్ చేయడం ఈజీనే అని అంతా అనుకున్నారు. కానీ లంక స్పిన్నర్ల దెబ్బకు రోహిత్ సేన 138 పరుగులకు చాపచుట్టేసింది. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో సిరీస్​ను 0-2ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ డిసైడర్ ఫైట్​లో మెన్ ఇన్ బ్లూ ఓటమికి గల 3 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్ ఓటమికి ప్రధాన కారణంగా బ్యాటింగ్ ఫెయిల్యూర్​ను చెప్పాలి. ఈ సిరీస్ ఆసాంతం మన బ్యాటర్లు దారుణంగా ఆడుతూ వచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప ఎవరూ పెద్దగా రన్స్ చేసింది లేదు. ఇవాళ కూడా అదే జరిగింది. హిట్​మ్యాన్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి టీమ్​కు మంచి స్టార్ట్ అందించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన వారందరూ విఫలమయ్యారు. శుబ్​మన్ గిల్ (6), రిషబ్ పంత్ (6), శ్రేయస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ (2), శివమ్ దూబె (9) సింగిల్ డిజిట్​కే పరిమితం అయ్యారు. ఆఖర్లో టెయిలెండర్ వాషింగ్టన్ సుందర్ (30) పోరాడకపోతే భారత్ స్కోరు వంద దాటకపోయేది. ఇక, మన జట్టు ఓటమికి మరో కారణంగా టీమ్ కాంబినేషన్​ను చెప్పొచ్చు. ఇవాళ్టి మ్యాచ్​లో కేవలం ఒకే స్పీడ్​స్టర్​తో ఆడింది టీమిండియా.

సిరాజ్​ రూపంలో ఒకే స్పెషలిస్ట్ పేసర్​తో వెళ్లింది భారత్. కానీ అతడు ఫెయిలయ్యాడు. లంకపై రెచ్చిపోయి బౌలింగ్ చేసే సిరాజ్.. ఇవాళ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇంకో క్వాలిటీ పేసర్ లేకపోవడం స్టార్టింగ్ ఓవర్స్​లో భారత్​ను ఇబ్బంది పెట్టింది. కేఎల్ రాహుల్​ను తీసేసి పంత్​ను తీసుకుంటే అతడు 6 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. రాహుల్ ఉంటే వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసి.. స్కోరు బోర్డును కదిలించే ఛాన్స్ ఉండేది. పంత్ అటు హిట్టింగ్ చేయలేక, ఇటు డిఫెన్స్ చేయలేక ఈజీగా వికెట్​ను సమర్పించుకున్నాడు.

ఈ వన్డేలో భారత్ ఓటమికి ఇంకో ప్రధాన కారణం కోహ్లీ. సిరీస్​లోని తొలి రెండు మ్యాచుల్లో ఫెయిలైన కింగ్.. ఈ మ్యాచ్​లో 20 పరుగులతో మంచి స్టార్ట్ అందుకున్నాక ఔట్ అయ్యాడు. బాల్ గింగిరాలు తిరుగుతున్న పిచ్​పై మరింత పట్టుదలతో ఆడి ఇన్నింగ్స్​ను నిలబెట్టాల్సినోడు త్వరగా ఔట్ అవడంతో టీమ్ అంతా కొలాప్స్ అయింది. ఛేజింగ్ మాస్టర్ అయిన కోహ్లీ.. అర్లీగా ఔట్ అవడం భారత్ విజయావకాశాలను భారీగా దెబ్బ తీసింది. అతడు ఓ ఎండ్​లో ఉంటే మరో ఎండ్​లో ఇతర బ్యాటర్లు అటాకింగ్ చేసేవారు. కానీ ఇది సాధ్యపడలేదు. కోహ్లీనే కాదు.. కెప్టెన్ రోహిత్ త్వరగా ఔట్ అవడం కూడా జట్టుకు మైనస్​గా మారింది. మంచి స్టార్ట్ అందించిన రోహిత్.. ఇంకో పది ఓవర్ల పాటు ఉంటే లంక నుంచి మ్యాచ్​ను లాగేసుకునేవాడు. బౌలర్లలో సిరాజ్ వైఫల్యం, బ్యాటర్లలో కోహ్లీ, అయ్యర్, పంత్, గిల్ ఫెయిల్యూర్ జట్టును కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి.

Show comments