India To Play 2-Day Practice Match In Australia: లంక టూర్​తో తప్పు తెలుసుకున్న BCCI.. ఆసీస్​ కోసం గట్టి ప్లానింగ్!

లంక టూర్​తో తప్పు తెలుసుకున్న BCCI.. ఆసీస్​ కోసం గట్టి ప్లానింగ్!

Team India: శ్రీలంక టూర్ భారత్​కు మిక్స్​డ్ ఎక్స్​పీరియెన్స్​ను అందించింది. జట్టుతో పాటు మన దేశ క్రికెట్ బోర్డుకు కూడా ఈ సిరీస్ పలు పాఠాలు నేర్పింది.

Team India: శ్రీలంక టూర్ భారత్​కు మిక్స్​డ్ ఎక్స్​పీరియెన్స్​ను అందించింది. జట్టుతో పాటు మన దేశ క్రికెట్ బోర్డుకు కూడా ఈ సిరీస్ పలు పాఠాలు నేర్పింది.

శ్రీలంక టూర్ భారత్​కు మిక్స్​డ్ ఎక్స్​పీరియెన్స్​ను అందించింది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్​లో మెన్ ఇన్ బ్లూ విజేతగా నిలిచింది. మూడు టీ20ల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది. ఇదే జోరులో వన్డే సిరీస్​లో కూడా ఆతిథ్య జట్టును వైట్​వాష్ చేయడం ఖాయమని అంతా భావించారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి టాప్ బ్యాటర్స్ అంతా కమ్​బ్యాక్ ఇవ్వడంతో లంక ఖేల్ ఖతం అని అనుకున్నారు. ఆ టీమ్ గట్టి పోటీనిస్తే అదే గొప్పని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. లోకల్ కండీషనర్స్​ను బాగా ఉపయోగించుకున్న ఆతిథ్య జట్టు.. మన టీమ్​ను వరుస మ్యాచుల్లో ఓడించింది.

భారత బ్యాటర్ల స్పిన్ వీక్​నెస్​పై గట్టిగా కొట్టింది శ్రీలంక. వరుస మ్యాచుల్లో ఓడించి 2-0తో వన్డే సిరీస్​ను సొంతం చేసుకుంది. ఈ వైఫల్యం జట్టుతో పాటు మన దేశ క్రికెట్ బోర్డుకు కూడా పలు పాఠాలు నేర్పింది. ఎట్టకేలకు మేలుకొన్న బీసీసీఐ తదుపరి సిరీస్​ల విషయంలో జాగ్రత్తగా ఉంటోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. చిన్న జట్టు, పెద్ద జట్టు అనే తేడాల్లేకుండా ప్రతి సిరీస్​ను అంతే ముఖ్యంగా భావిస్తూ టీమ్​ను సమాయత్తం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆఖర్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఒక డే/నైట్ మ్యాచ్​ను ప్లాన్ చేస్తోంది.

గత ఆసీస్ పర్యటనలో డే అండ్ నైట్ టెస్ట్​లో భారత్​ దారుణంగా ఓడింది. 36 రన్స్​కే కుప్పకూలింది. ఆ ఎక్స్​పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఆఖర్లో జరిగే టూర్​లో రెండ్రోజుల డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్​ను ప్లాన్ చేస్తోంది. దీనికి కంగారూ బోర్డు కూడా ఓకే చెప్పింది. కాన్​బెర్రా వేదికగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 మధ్య ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్​తో ఈ మ్యాచ్ జరగనుంది. ఆసీస్ టూర్ నవంబర్ 15న మొదలవనుంది. కాగా, లంక టూర్​లో ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా నేరుగా బరిలోకి దిగి చేతులు కాల్చుకుంది టీమిండియా. స్పిన్ పిచ్​లు కదా ఈజీగా ఆడేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్​కు పోయి సిరీస్​ను కోల్పోయింది. ఆసీస్​లో కూడా గతంలో ఇలాంటి అనుభవం ఉండటం, తాజాగా లంక సిరీస్ నేర్పిన పాఠంతో ప్రాక్టీస్ మ్యాచ్​లు ఆడటం, లోకల్ కండీషన్స్​కు అలవాటు పడటం ఎంత కీలకమో బీసీసీఐ గ్రహించింది. అందుకే తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంది. అయితే ఈ పనేదో ముందే చేస్తే లంకతో సిరీస్ గెలిచేవాళ్లమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.

Show comments