నేడే ఆస్ట్రేలియాతో తొలి వన్డే! భారత ప్లేయింగ్‌ 11 ఇదే

ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌ 2023కు ముందు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ ఇరు దేశాలకు ఎంతో కీలకం కానుంది. వరల్డ్‌ కప్‌ లాంటి బిగ్‌ ఈవెంట్‌ ముందు పటిష్టమైన జట్టుతో మూడు వన్డేలు ఆడటంతో టీమ్‌కు మంచి ప్రాక్టీస్‌ జరిగినట్లు అవుతుంది. పైగా వరల్డ్‌ కప్‌ భారత్‌లోనే జరుగుతుండటంతో.. ఇండియాతో మూడు వన్డేలు ఆస్ట్రేలియాకు ఎంతో ప్లస్‌ కానున్నాయి. మరోవైపు టీమిండియా సైతం తమ టీమ్‌లోని యువ క్రికెటర్లకు బిగ్‌ టీమ్‌తో గేమ్‌ టైమ్‌ దొరుకుతుందని భావిస్తుంది.

అందుకే జట్టులోని మోస్ట్‌ సీనియర్‌ ప్లేయర్స్‌ అయిన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యాలకు తొలి రెండు వన్డేలకు రెస్ట్‌ ఇచ్చారు. కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా, రవీంద్ర జడేజాను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. వీరితో పాటు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉన్నా ఆటగాళ్లతో పాటు, వరల్డ్‌ కప్‌ టీమ్‌లో లేని ప్లేయర్లను కూడా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ కోసం ఎంపిక చేశారు. వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉన్న అక్షర్‌ పటేల్‌ ఇటీవల ఆసియా కప్‌ ఫైనల్‌ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. అతను వరల్డ్‌ కప్‌ దూరం అయితే.. అతని స్థానంలో అశ్విన్‌ లేదా వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకోవాలని చూస్తున్నారు. వారిద్దరికీ ఆసీస్‌తో సిరీస్‌ అగ్ని పరీక్ష కానుంది. ఈ సిరీస్‌లో రాణింపుపైనే వారిలో ఎవర్ని తీసుకోవాలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ డిసైడ్‌ చేయనుంది. మరి కీలకమైన ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు భారత ప్టేయింగ్‌ ఎలెవన్‌ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..

భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌(అంచనా)
శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌), తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.

ఇదీ చదవండి: ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై విచారణ జరపండి! పోలీసులకు ఫిర్యాదు

Show comments