వీడియో: అర్ష్​దీప్ ఓవరాక్షన్! పరాగ్​ను ఔట్ చేశాక ఏం చేశాడంటే..?

Arshdeep Singh, Riyan Parag, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ-2024లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. రియాన్ పరాగ్ ఔట్ అయ్యాక అర్ష్​దీప్ చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.

Arshdeep Singh, Riyan Parag, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ-2024లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. రియాన్ పరాగ్ ఔట్ అయ్యాక అర్ష్​దీప్ చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.

టీమిండియా స్టార్ పేసర్ అర్ష్​దీప్ సింగ్ గురించి తెలిసిందే. బౌలింగ్ టైమ్​లో అతడు మిక్స్​డ్ ఎమోషన్స్ చూపిస్తుంటాడు. ఒక్కోసారి ఎంత ప్రెజర్ ఉన్నా కూల్​గా, కామ్​గా తన పని తాను చేసుకుపోతాడు. కానీ కొన్నిసార్లు మాత్రం కాస్త దూకుడుగా వ్యవహరిస్తాడు. అయితే ప్రత్యర్థుల మీద చూపిస్తే ఓకే గానీ.. ఒకే టీమ్ తరఫున ఆడే ప్లేయర్, అందునా ఏళ్లుగా తెలిసిన వాడు, మంచి ఫ్రెండ్ కూడా అయిన క్రికెటర్​పై అగ్రెషన్ చూపించడం చర్చనీయాంశంగా మారింది. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా డీ తరఫున బరిలోకి దిగిన అర్ష్​దీప్ చేసిన ఒక పని ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియ ఏ బ్యాటర్ రియాన్ పరాగ్​ను ఔట్ చేశాక ఈ పొడగరి బౌలర్ ఓవరాక్షన్ చేశాడు. అవసరం లేకపోయినా కాస్త అతిగా రియాక్ట్ అయ్యాడు.

పరాగ్​ను మంచి డెలివరీతో ఔట్ చేశాడు అర్ష్​దీప్. ఆఫ్ స్టంప్​కు కాస్త బయట ఊరించే బంతిని వేశాడీ పేసర్. అయితే అప్పటికే ఆ ఓవర్​లో ఒక బౌండరీ కొట్టిన పరాగ్.. అదే ఊపులో మరో భారీ షాట్​కు ప్రయత్నించాడు. ఆఫ్ సైడ్ బిగ్ షాట్ కొడదామని అనుకున్నాడు. కానీ షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కాస్తా వెళ్లి స్లిప్స్​లో కాచుకొని ఉన్న దేవ్​దత్ పడిక్కల్ దగ్గరకు వెళ్లింది. పడిక్కల్ దాన్ని చక్కగా అందుకున్నాడు. దీంతో పరాగ్ నిరాశతో క్రీజును వీడాడు. అయితే అతడు సైలెంట్​గా వెళ్లిపోతున్న బ్యాటర్ వైపు చూస్తూ అర్ష్​దీప్ ఓవరాక్షన్ చేశాడు. గుడ్లు ఉరిమేలా చూస్తూ గట్టిగా అరిచాడు. అయినా పరాగ్ పట్టించుకోకుండా పెవిలియన్ వైపు నడక సాగించాడు.

అర్ష్​దీప్ ఓవరాక్షన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతమాత్రానికే అంత అతి చేయడం అవసరమా అని నెటిజన్స్ అతడిపై సీరియస్ అవుతున్నారు. టీమిండియాకు కలిసే ఆడతారు కదా.. ఇలాంటి పనులతో ఫ్రెండ్​షిప్ దెబ్బతినదా అని ప్రశ్నిస్తున్నారు. అండర్​-19లో కూడా కలసి ఆడారు, చాన్నాళ్లుగా ఒకరికొకరు తెలుసు.. అయినా ఏదో వేరే దేశం ప్లేయర్​లా బిహేవ్ చేయడం, గట్టిగా అరవడం అవసరమా అని నిలదీస్తున్నారు. సహచర ఆటగాళ్లతో రిలేషన్స్ బాగుంటే కెరీర్​కు మంచిదని, ఇలాంటి పనుల్ని బీసీసీఐ ఓ కంట కనిపెడుతూ ఉంటుందని, జాగ్రత్తగా ఉండకపోతే కష్టమని అర్ష్​దీప్​ను హెచ్చరిస్తున్నారు. ఇక, ఈ ఇన్నింగ్స్​లో 29 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 5 బౌండరీలు, సిక్స్ సాయంతో 37 పరుగులు చేశాడు. ఉన్నంత సేపు భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. అతడి టీమ్ ఇప్పుడు 7 వికెట్లకు 238 పరుగులతో ఉంది. షమ్స్ ములానీ (62 నాటౌట్) పోరాడుతున్నాడు. మరి.. పరాగ్​తో అర్ష్​దీప్ వ్యవహరించిన తీరుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments