2 వన్డేలకే రిటైర్మెంట్! దాదా, ద్రవిడ్, సెహ్వాగ్​తో ఆడినోడు బ్యాంకు ఉద్యోగిగా మిగిలిపోయాడు!

Gyanendrakumar Kedarnath Pandey, Team India: క్రికెట్​లో ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కొందరు మాత్రమే స్టార్లుగా మారి గేమ్​ను ఏలుతారు. అయితే ప్రతిభ ఉన్నా ఎదగలేక అనామకులుగా మిగిలిన పోయినవారూ ఉన్నారు. ఆ కోవలోకే వస్తాడీ భారత మాజీ క్రికెటర్.

Gyanendrakumar Kedarnath Pandey, Team India: క్రికెట్​లో ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కొందరు మాత్రమే స్టార్లుగా మారి గేమ్​ను ఏలుతారు. అయితే ప్రతిభ ఉన్నా ఎదగలేక అనామకులుగా మిగిలిన పోయినవారూ ఉన్నారు. ఆ కోవలోకే వస్తాడీ భారత మాజీ క్రికెటర్.

క్రికెట్​లో ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కొందరు మాత్రమే స్టార్లుగా మారి గేమ్​ను ఏలుతారు. మరికొందరు మాత్రం ఆ స్థాయికి చేరుకోలేకపోతారు. ప్రతిభ ఉన్నా ఎదగలేక అనామకులుగా మిగిలిన పోయినవారూ ఉన్నారు. అవకాశాలు లేక రేసులో వెనుకబడి మామూలు ఆటగాళ్లలా ఉండిపోయిన వారూ ఉన్నారు. అలాంటి ఓ క్రికెటర్ కన్నీటి కథే ఇది. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి లెజెండ్స్​తో కలసి భారత్ తరఫున ఆడిన ఓ ప్లేయర్.. ఆ తర్వాత కాలంలో మళ్లీ అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించాడు. టాప్ క్రికెటర్​గా ఓ వెలుగు వెలగాల్సినోడు.. బ్యాంక్ ఉద్యోగిగా మిగిలిపోయాడు. అతడి గురించి మరింతగా తెలుసుకుందాం..

భారత మాజీ క్రికెటర్ జ్ఞానేంద్రకుమార్ కేదార్​నాథ్ పాండే గురించి ఇప్పుడు అంతా డిస్కస్ చేస్తున్నారు. చాన్నాళ్లు వెలుగులోకి రాని ఈ ఆల్​రౌండర్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఉత్తర్​ ప్రదేశ్​కు చెందిన ఈ 52 ఏళ్ల మాజీ క్రికెటర్.. అప్పట్లో డొమెస్టిక్ క్రికెట్​లో అదరగొట్టి భారత జట్టుకు ఎంపికయ్యాడు. మార్చి 24, 1999లో పెప్సీ కప్ ట్రై-సిరీస్​లో భాగంగా ఇండియా-పాకిస్థాన్​ మధ్య జరిగిన వన్డే మ్యాచ్​తో అంతర్జాతీయ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చాడు జ్ఞానేంద్రకుమార్. స్పిన్ ఆల్​రౌండర్ అయిన అతడు.. టీమిండియాలో సెటిల్ అవుతాడని అంతా అనుకున్నారు. ఆ టైమ్​లో భారత జట్టులో ఆల్​రౌండర్ల కొరత ఉండేది. దీంతో ఆ ప్లేస్​ను జ్ఞానేంద్రకుమార్ భర్తీ చేస్తాడని అనుకుంటే.. రెండు వన్డేలకు అతడి కెరీర్ ముగిసింది. అదే పాకిస్థాన్​తో మొహాలీలో వారం తర్వాత ఆడిన రెండో మ్యాచ్​ అతడికి లాస్ట్ మ్యాచ్​గా నిలిచింది. ఆ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు.

ఫస్ట్ క్లాస్​ క్రికెట్​లో 117 మ్యాచుల్లో కలిపి 5348 పరుగులు చేసిన జ్ఞానేంద్రకుమార్.. 165 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్​-ఏ క్రికెట్​లో 82 మ్యాచుల్లో 1781 పరుగులు చేసి.. 89 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో మరిన్ని అవకాశాలు ఇస్తే అతడు తప్పక రాణించేవాడేమో. కానీ సెలెక్టర్లు మాత్రం అతడ్ని కరుణించలేదు. డొమెస్టిక్ క్రికెట్​లో ఎంత రాణించినా, ఆరేళ్ల పాటు తీవ్రంగా ప్రయత్నాలు చేసినా అతడ్ని తిరిగి నేషనల్ టీమ్​లోకి తీసుకోలేదు. దీంతో కెరీర్​పై ఆశలు వదులుకున్నాడు జ్ఞానేంద్రకుమార్.

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీఆర్ ఏజెంట్​గా వర్క్ చేస్తున్నాడు జ్ఞానేంద్రకుమార్. అప్పటి బీసీసీఐ సెక్రెటరీ జయంత్ లేలే నుంచి సపోర్ట్ లేకపోవడంతో తాను ఇలా మిగిలిపోయానని.. లేకపోతే కెరీర్ వేరేలా ఉండేదని ఓ యూట్యూబ్ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్ఞానేంద్రకుమార్ వాపోయాడు. ఇది చూసిన నెటిజన్స్.. అందరి కెరీర్ ఒకేలా ఉండదని, జ్ఞానేంద్రకుమార్​కు బోర్డు నుంచి మద్దతు లభించి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఓ మంచి క్రికెటర్ ఆటను అందరమూ మిస్ అయ్యామని చెబుతున్నారు. అతడి కన్నీటి కథ అందరికీ తెలియాలని కోరుకుంటున్నారు.

Show comments