iDreamPost
android-app
ios-app

ద్రవిడ్​ వల్లే కాలేదు.. నువ్వెంత? కొత్త కోచ్ గంభీర్​కు BCCI పెద్దల వార్నింగ్!

  • Published Jul 30, 2024 | 12:59 PM Updated Updated Jul 30, 2024 | 12:59 PM

Gautam Gambhir: టీమిండియా నయా కోచ్ గౌతం గంభీర్ ఫస్ట్ అసైన్​మెంట్​లో సక్సెస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​ను భారత్ సొంతం చేసుకోవడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

Gautam Gambhir: టీమిండియా నయా కోచ్ గౌతం గంభీర్ ఫస్ట్ అసైన్​మెంట్​లో సక్సెస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​ను భారత్ సొంతం చేసుకోవడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

  • Published Jul 30, 2024 | 12:59 PMUpdated Jul 30, 2024 | 12:59 PM
ద్రవిడ్​ వల్లే కాలేదు.. నువ్వెంత? కొత్త కోచ్ గంభీర్​కు BCCI పెద్దల వార్నింగ్!

టీమిండియా నయా కోచ్ గౌతం గంభీర్ ఫస్ట్ అసైన్​మెంట్​లో సక్సెస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​ను భారత్ సొంతం చేసుకోవడంతో అతడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మూడు టీ20ల ఈ సిరీస్​ను ఇంకో మ్యాచ్ ఉండగానే మెన్ ఇన్ బ్లూ పట్టేసింది. దీంతో తర్వాత జరిగే వన్డే సిరీస్​ను కూడా ఇదే విధంగా గెలుచుకోవాలని భావిస్తున్నాడు కొత్త కోచ్ గంభీర్. అయితే ఈ సిరీస్​కు ముందు ఓ విషయంలో అతడికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కోచ్ రాహుల్ ద్రవిడ్ వల్లే కాలేదు.. నువ్వెంత అంటూ పలువురు బోర్డు పెద్దలు గౌతీని హెచ్చరించారని తెలుస్తోంది.

టీ20 సిరీస్​లో జూనియర్లతో బాగానే కలసిపోయాడు కోచ్ గంభీర్. కానీ ఇక మీదట జరగబోయే సిరీస్​ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సూపర్​స్టార్లతో పాటు జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి సీనియర్లను అతడు డీల్ చేయాల్సి ఉంటుంది. దూకుడు స్వభావం ఉన్న గౌతీ.. తన మాట వినకపోతే గొడవకు దిగుతాడేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ పెద్దలు అతడికి వార్నింగ్ ఇచ్చారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ‘ఇదంత ఈజీ కాదు. ఫ్రాంచైజీ క్రికెట్​లోలా ఇక్కడ నేనే బాస్​ను.. నేనేం చెబితే అదే చేయాలి అంటే కుదరదు. మన టీమ్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం భిన్నంగా ఉంటుంది. ప్రతి ఆటగాడితో ఓపికగా మాట్లాడాలి. అవసరమైతే ఫోన్ చేయాలి’ అని గంభీర్​కు బోర్డు నుంచి క్లియర్​గా ఇన్​స్ట్రక్షన్స్ వెళ్లాయని వినికిడి.

Dravid

హెడ్ కోచ్​గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో లెజెండ్ ద్రవిడ్ కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాడని.. అప్పటి నుంచి భారత క్రికెట్​లో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఐపీఎల్​లో ఆడటంతో పాటు యాడ్స్ రూపంలో ఆటగాళ్లంతా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని.. టీమ్​లోని కొందరు ఐపీఎల్​లో కెప్టెన్లుగా కూడా పని చేస్తుండటంతో వాళ్లను సాఫ్ట్​గా డీల్ చేయాలని గంభీర్​కు సూచించిందట బీసీసీఐ.

అప్పట్లో కుంబ్లే కోచ్​గా వచ్చిన కొత్తలో ఆటగాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాడట. అందుకే అతడ్ని తీసేసి రవిశాస్త్రిని కోచ్ చేశారనే పుకార్లు వచ్చాయి. ఈ విషయాన్నీ తెలుసు కాబట్టి ద్రవిడ్ ప్లేయర్ల విషయంలో ఓపికగా ఉంటూ వచ్చాడని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అందుకే అతడి వల్లే కాలేదు, నువ్వెంత అంటూ గౌతీకి బోర్డు పెద్దలు హెచ్చరికలు జారీ చేశారని సమాచారం. మరి.. కోహ్లీ, రోహిత్ వంటి సూపర్​స్టార్లతో గంభీర్ కలసిపోతాడా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.