iDreamPost
android-app
ios-app

VIDEO: జడేజాపై చేయి చేసుకున్న వార్నర్‌!

  • Published Sep 23, 2023 | 12:10 PM Updated Updated Sep 23, 2023 | 12:10 PM
  • Published Sep 23, 2023 | 12:10 PMUpdated Sep 23, 2023 | 12:10 PM
VIDEO: జడేజాపై చేయి చేసుకున్న వార్నర్‌!

వరల్డ్‌ కప్‌కి ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలోని భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు ఏ దశలోనే అవకాశం ఇవ్వకుండా.. క్రికెట్‌ అభిమానులకు అసలైన వన్డే క్రికెట్‌ మజాను అందిచింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ లేకుండానే బరిలోకి దిగినా కూడా.. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టును ఓడించడంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. సగం బెస్ట్‌ టీమ్‌ లేకుపోయినా.. వరల్డ్‌ కప్‌ ఇలాంటి ప్రదర్శనతో టీమిండియాకు కొండంత బలం వచ్చినట్లు అయింది.

కాగా, ఈ మ్యాచ్‌ తర్వాత నాటౌట్‌గా నిలిచిన టీమిండియా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, జడేజా.. ఆసీస్‌ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్స్‌ ఇస్తున్న క్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌, మన డేవిడ్‌ భాయ్‌.. జడ్డూను నెత్తిపై కొట్టాడు. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. అది సరదాగానే జరిగింది. ఐపీఎల్‌ కారణంగా డేవిడ్‌ వార్నర్‌ భారత క్రికెట్‌ అభిమానులుకు బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా మన సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ ఫ్యాన్స్‌ అయితే.. డేవిడ్‌ భాయ్‌ని వార్నర్‌ను ముద్దుగా పిలుచుకుంటారు. అలాగే.. భారత క్రికెటర్లతో కూడా వార్నర్‌కు మంచి ఫ్రెండ్‌షిప్‌ ఏర్పండి. జడేజా-వార్నర్‌ చాలా క్లోజ్‌గా ఉంటారు. ఐపీఎల్‌ సందర్భంగా కూడా వీరిద్దరూ ఫన్నీ థింక్స్‌తో నవ్వించారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌, ఆస్ట్రేలియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మొహమ్మద్‌ షమీ 5 వికెట్లతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ఆశించిన స్థాయిలో స్కోర్‌ చేయలేకపోయింది. వార్నర్‌(52), స్మిత్‌(41), ఇంగ్లిస్‌(45) రాణించడంతో 276 పరుగులు చేసి సరిగ్గా 50 ఓవర్లకు ఆలౌట్‌ అయింది. షమీ 5 వికెట్లతో సత్తా చాటగా, జడేజా, అశ్విన్‌, బుమ్రా తలో వికెట్‌ తీశారు. ఇక 277 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(71), శుబ్‌మన్‌ గిల్‌(74) అద్భుతమైన స్టార్‌ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత టీమిండియా వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. శ్రేయస్‌ అయ్యర్‌(3) అన్‌లక్కీగా రనౌట్‌ అయ్యాడు. ఇషాన్‌ కిషన్‌ (18) పరుగులు మాత్రమే చేసినా.. కెప్టెన్‌ రాహుల్‌ (58 నాటౌట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌(50) టీమిండియా విజయతీరాలకు చేర్చారు. గెలుపు ముంగిట సూర్య అవుటైనా.. జడేజా 3 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా సాధించిన విజయంతో పాటు, వార్నర్‌-జడేజా బాండింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తొలిసారి అలా ఆడకుండా ఉన్నాను.. ఇలాంటి ఇన్నింగ్స్‌ నా కల: సూర్య