iDreamPost
android-app
ios-app

World Cup: వివాదంలో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌!

  • Published Oct 13, 2023 | 10:46 AM Updated Updated Oct 13, 2023 | 10:50 AM
  • Published Oct 13, 2023 | 10:46 AMUpdated Oct 13, 2023 | 10:50 AM
World Cup: వివాదంలో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా మంచి జోరుమీదుంది. తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టును ఓడించిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్థాన్‌పై డామినేటింగ్‌ విక్టరీ సాధించింది. దీంతో.. టీమిండియా రాబోయే మ్యాచ్‌లకు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తోంది. అయితే.. ఈ మొత్తం వరల్డ్‌ కప్‌కే హైలెట్‌గా నిలిచే మ్యాచ్‌ కోసం టీమిండియా రెడీ అయింది. ఆ మ్యాచ్‌ ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎస్‌.. ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌. ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌.. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో శనివారం జరగనుంది. భారీ క్రేజ్‌ ఉన్న ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ బ్యాడ్‌ న్యూస్‌ అందుతోంది.

ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. అది భావోద్వేగాలతో కూడిన ఓ మినీ యుద్ధం. ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులు ఆ మ్యాచ్‌ అలానే భావిస్తారు. అందుకే ఆటగాళ్లపై అంత తీవ్ర ఒత్తిడి ఉంటుంది. వరల్డ్‌ కప్‌లో మరే జట్టుతో మ్యాచ్‌ ఓడినా పర్వాలేదు కానీ, పాకిస్థాన్‌పై మాత్రం ఓడిపోవద్దని ఇండియన్‌ ఫ్యాన్స్‌, భారత్‌పై ఓడిపోవద్దని పాకిస్థాన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అయితే.. వన్డ్‌ వరల్డ్‌ కప్స్‌లో మాత్రం పాకిస్థాన్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఏకంగా 7 సార్లు పాకిస్థాన్‌ను టీమిండియా ఓడించింది. కానీ, పాక్‌ ఒక్క సారి కూడా గెలవలేదు. ఇంత ప్రతిష్టాత్మక మ్యాచ్‌ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తుంటే.. మ్యాచ్‌పై మాత్రం నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ వేల మంది ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం #BoycottIndoPakMatch అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మన సైనికులను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్‌కు మన దేశంలో పూలు చల్లుతూ.. అహ్మాదాబాద్‌లో ఇచ్చిన ఆతిథ్యంపై చాలా మంది భారతీయులు ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. అందుకే ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మ్యాచ్‌ జరుగుతుందా? లేదా? అనుమానం క్రికెట్‌ వర్గాల్లో కలుగుతోంది. అయితే.. ఇలాంటి వివాదాలు కొత్తకాదు. గతంలో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సమయంలోనూ అనేక సార్లు వచ్చాయి. ఇకపోతే.. శనివారం మ్యాచ్‌ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతుందని బీసీసీఐ అధికారులు తెలుపుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: రోహిత్‌ సెంచరీ తర్వాత కోహ్లీ రియాక్షన్‌ చూడండి!