iDreamPost
android-app
ios-app

VIDEO: సెల్ఫీ అడిన ఫ్యాన్‌పై బాబర్‌ అసహనం! ఏం చేశాడంటే..?

  • Published Sep 12, 2023 | 8:25 AM Updated Updated Sep 12, 2023 | 10:31 AM
  • Published Sep 12, 2023 | 8:25 AMUpdated Sep 12, 2023 | 10:31 AM
VIDEO: సెల్ఫీ అడిన ఫ్యాన్‌పై బాబర్‌ అసహనం! ఏం చేశాడంటే..?

టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఘోర ఓటమి తర్వాత పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ తీవ్ర ఫ్రస్టేషన్‌లో కనిపించాడు. ఇతంటి దారుమైన ఓటమి ఎదురైతుందని ఊహించినట్టు లేడు. అందుకే.. చాలా చిరాగ్గా కనిపించాడు. తన దగ్గరికి వచ్చిన అభిమానులపై ఒంటికాలిపై లేచాడు. సాధారణంగా బాబర్‌ అజమ్‌ ఎప్పుడూ చాలా ప్రశాంతంగానే కనిపిస్తున్నాడు. కానీ సోమవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపు 228 పరుగులతో తేడాతో ఎదురైన ఓటమితో సహనం కోల్పోయినట్లు కనిపించాడు.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. మైదానంలో అటూ ఇటూ తిరుగుతున్న బాబర్‌ను ఓ గ్రౌండ్‌ స్టాఫ్‌ సెల్ఫీ అడిగి తీసుకుంటున్నాడు. పాపం.. సెల్ఫీ కోసం అతను బాబర్‌తో పాటే నడుస్తున్నా.. అలా ఆగి ఆగకుండా వెళ్లిపోయాడు బాబర్‌. దాంతో మళ్లీ సెల్ఫీ కోసం ప్రయత్నించాడా ఫ్యాన్‌. కానీ, బాబర్‌ మాత్రం.. ‘ఏంటీ నాతో పాటు డ్రెస్సింగ్‌ రూమ్‌ వరకు వచ్చేస్తావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో ఆ ఫ్యాన్‌ బాబర్‌కు దూరంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. పాపం.. ఓటమి బాధలో ఫ్రస్టేషన్‌ అవుతున్నాడంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఇక​ మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆదివారం వర్షం కారణంగా ఆగిపోయిన మ్యాచ్‌.. సోమవారం రిజర్వ్‌ డేలో పూర్తిగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి.. 50 ఓవర్లో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. విరాట్‌ కోహ్లీ (122 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌(111 నాటౌట్‌) సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు ఆదివారం టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ(56), శుబ్‌మన్‌ గిల్‌(58) హాఫ్‌ సెంచరీలతో సూపర్‌ స్టార్ట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక 357 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను టీమిండియా బౌలర్లు వణికించారు. ముందు పేసర్లు పాక్‌ను అల్లాడిస్తే.. తర్వాత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ చుట్టేశాడు. మొత్తం మీద పాక్‌ను 128 పరుగులకే కుప్పకూల్చారు. 32 ఓవర్లలో 128 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ ముగించారు. చివరి ఇద్దరు బ్యాటర్లు గాయాలతో బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఆలౌట్‌గా ప్రకటించారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్‌ 58, బుమ్రా, శార్దుల్‌, పాండ్యా చెరో వికెట్‌ దక్కించుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓటమితో పాటు బాబర్‌ అజమ్‌ అసహనానికి గురి కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)