iDreamPost
android-app
ios-app

చేవెళ్లలో కాంగ్రెస్ బహిరంగ సభ.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో వరాలు

చేవెళ్లలో కాంగ్రెస్ బహిరంగ సభ.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో వరాలు

తెలంగాణ కాంగ్రెస్ ప్రజా గర్ణన పేరుతో శనివారం చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వచ్చారు. ఇక రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ సభ వేదిక నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ యువతకు వరాల జల్లు కురిపించారు. మొత్తం 12 అంశాలతో డిక్లరేషన్ రూపొందిచినట్లు తెలుస్తుంది. ఈ డిక్లరేషన్ తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 రిజర్వేషన్లు పెంచుతామని కూడా ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇంతకు కాంగ్రెస్ ప్రకటించిన ఈ డెక్లరేషన్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో ప్రధాన అంశాలు:

  • ప్రధానంగా డిక్లరేషన్ లో రూ.12 లక్షలతో దళిత బంధు
  • అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం
  • 10వ తరగతి పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.10 వేలు
  • ఇంటర్ పాసైన వారికి రూ.15 వేలు, డిగ్రీ పాసైన వారికి రూ. లక్ష
  • ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 రిజర్వేషన్లు పెంపు
  • ప్రతి మండలానికి గురుకుల పాఠశాల
  • విదేశీ వర్సిటీల్లో ప్రవేశం పొందని విద్యార్థులకు ఆర్థిక సాయం
  • ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలతో ఈ డిక్లరేషన్ ను ప్రకటించారు.

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ నేత తుమ్మల కంటతడి.. మళ్లీ హీటెక్కిన ఖమ్మం రాజకీయం!

Jojobet GirişmeritbetmeritbetTophillbet girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetsafirbetMadridbetMadridbetcasibommadridbet girişganobetpokerklasjojobetMarsbahis GüncelCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom Girişdeneme bonusuGrandPashaBet Şikayet