iDreamPost
android-app
ios-app

వరుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు! ఇంతకి తెగించడానికి కారణమేమిటంటే?

  • Published Apr 24, 2024 | 7:31 PMUpdated Apr 24, 2024 | 7:31 PM

ఉత్తరప్రదేశ్‌లోని  ఓ దారుణమైన సంఘటన జరిగింది. ప్రేమించిన వ్యక్తి వేరే పెళ్లికి సిద్ధమవ్వడంతో.. అతని గర్ల్  చేసిన దారుణమైన పనికి స్థానికంగా సంచలనంగా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని  ఓ దారుణమైన సంఘటన జరిగింది. ప్రేమించిన వ్యక్తి వేరే పెళ్లికి సిద్ధమవ్వడంతో.. అతని గర్ల్  చేసిన దారుణమైన పనికి స్థానికంగా సంచలనంగా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Apr 24, 2024 | 7:31 PMUpdated Apr 24, 2024 | 7:31 PM
వరుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు! ఇంతకి తెగించడానికి కారణమేమిటంటే?

ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమికులు తీసుకునేటువంటి నిర్ణయాలు తమ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. ఈ మధ్య ప్రేమించుకోవడం, ఏదో ఒక కారణాలతో విడిపోవడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ప్రేమించుకొని కలసి తిరిగినంత వరకు బాగానే ఉన్నా ప్రేమికులు.. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు వద్దన్నారని, వేరే సంబంధాలు చూస్తున్నారని ఇలా రకరకాల కారణాలతో మధ్యలనే ప్రేమించిన వాళ్లకి గుడ్ బాయి చేప్తారు. ఇక ప్రాణంగా ప్రేమించిన వారు దూరం అవుతున్నారనే నేపథ్యంలో.. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, ప్రేమించిన వాళ్లని హత్య చేయడం వంటి ఘటనలు తరుచుగా వింటు ఉన్నాం. అయితే సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలు, అమ్మాయిలను ప్రేమించడం లేదని, ప్రేమించి మోసం చేసిందని హత్యలు చేసిన ఘటనలు చూసే ఉంటాం. కానీ, తాజాగా ప్రమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ అమ్మాయి చేసిన పనికి స్థానికంగా సంచలనంగా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని  ఓ దారుణమైన సంఘటన జరిగింది. ప్రేమించిన వ్యక్తి వేరే పెళ్లికి సిద్ధమవ్వడంతో.. అతని గర్ల్  యాసిడ్‌ పోసింది. ఈ ఘటన ఏప్రిల్ 23, మంగళవారం బన్స్‌డిహ్‌లోని డుమ్రీలో చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో వరుడిపై అతని గర్ల్‌ఫ్రెండ్‌ యాసిడ్‌ పోసింది. కాగా, పెళ్లి ఊరేగింపులో వరుడుగా ఉన్న తన ప్రియుడు పై సమయం చూసి ఆ అమ్మాయి యాసిడ్ పోసి దాడి చేసింది.  అయితే వీరు కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు. ఇది ఇష్టపడని వరుడి కుటుంబసభ్యులు ఉద్యోగం నెపంతో అతడిని బయట ప్రాంతానికి పంపి మరొకరితో పెళ్లి ఖరారు చేశారు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న యువతి తనని మోసం చేశాడని నేపథ్యంలో.. ప్రియుడిపై యాసిడ్ దాడికి దిగింది. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే వరుడి ఇంట్లోని కొందరు మహిళా సభ్యులు కొట్టి పోలీసులకు అప్పగించారు.

ఇక అదృష్టవశాత్తు అతడు పెద్దగా గాయపడలేదు అని పోలీసులు తెలిపారు. కాగా, బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 326బి  కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మున్నా లాల్ యాదవ్ తెలిపారు. అలాగే ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, లీగల్ నోటీసుల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్ హెడ్ అఖిలేష్ చంద్ర పాండే తెలిపారు. మరి, ప్రేమించిన వ్యక్తి వేరే పెళ్లికి సిద్ధమవ్వడంతో యాసిడ్ దాడికి పాల్పడిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి