Uppula Naresh
Uppula Naresh
ఈ మధ్యకాలంలో చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురై చాలా మంది ప్రాణాలు కోల్పుతున్నారు. కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా, మరి కొందరు మాత్రం ఇతరుల ర్యాష్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అచ్చం ఇలాగే నిర్లక్ష్యంగా చేసిన డ్రైవింగ్ కారణంగా ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు, దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఇంతకు ఈ రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగిందంటే?
కర్ణాటక మంగళూరులో బుధవారం ఉదయం కొందరు మహిళలు పుట్ పాత్ పై నడుస్తూ ఉన్నారు, అయితే ఇదే సమయంలో ఓ కారు వెనకాల నుంచి వేగంగా దూసుకొచ్చి పుట్ పాత్ పై నడుస్తున్న మహిళలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రత్తమైన స్థానికులు.. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
VIDEO | A woman died and four others were left injured after a speeding car drove onto the footpath and hit pedestrians near Mannagudda junction in Karnataka’s Mangaluru earlier today.
(Disclaimer: Disturbing visuals, viewer discretion is advised.)
(Source: Third Party) pic.twitter.com/DegX9AudNE
— Press Trust of India (@PTI_News) October 18, 2023