iDreamPost
android-app
ios-app

స్పీడ్ పెంచిన పీకే.. సోనియాతో మాజీ మహిళా ముఖ్యమంత్రి భేటీ..

  • Published Apr 19, 2022 | 10:11 AM Updated Updated Apr 19, 2022 | 11:20 AM
  • Published Apr 19, 2022 | 10:11 AMUpdated Apr 19, 2022 | 11:20 AM
స్పీడ్ పెంచిన పీకే.. సోనియాతో మాజీ మహిళా ముఖ్యమంత్రి భేటీ..

దేశ రాజధానిలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. పీడీపీ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా సోమవారం సోనియా గాంధీని కలిశారు.

పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం సోనియా గాంధీని కలవడం రాజకీయ కారిడార్‌లో చర్చనీయాంశంగా మారింది. కాశ్మీర్ లోయలో ఎన్నికల రంగం సిద్ధం చేసేందుకు మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ మరోసారి కలిసి పనిచేయడం ప్రారంభించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని చుట్టుముట్టేందుకు గత కొద్దిరోజులుగా అన్ని పెద్ద రాజకీయ పార్టీల నేతలు, వివిధ రాష్ట్రాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తద్వారా వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి భారతీయ జనతా పార్టీతో పోటీపడవచ్చు.

లోక్ సభ ఎన్నికలతోపాటు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తాచాటేలా ప్రశాంత్ కిషోర్ ఇటీవల వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇచ్చారు. దానిని పరిశీలించి, వారంలోగా ఆమెకు నివేదించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక చిన్న బృందాన్ని నియమించారు. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్‌ చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యంగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు భవిష్యత్తు వ్యూహంపై నేతలు చర్చించారు.

2024 నాటికి కాంగ్రెస్ పార్టీ 543 సీట్లలో 360 నుంచి 400 సీట్లపై దృష్టి పెట్టాలని, పార్టీ బలహీనంగా ఉన్న చోట భాగస్వామ్యం కోసం పనిచేయాలని ప్రశాంత్ కిషోర్ ఈ సమావేశంలో చెప్పినట్లు సమాచారం. కాగా, కిషోర్ త్వరలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే బలమైన ప్రచారం సాగుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా బీజేపీ ప్రత్యర్థి పార్టీలను ఏకం చేయడం ద్వారా కమలం పార్టీకి చెక్ పెట్టేందుకు పీకే గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş