iDreamPost
android-app
ios-app

Crime News భ‌ర్తతో విడాకులు, మరొకరితో మ‌ళ్లీ ప్రేమ,పెళ్లికి ఒప్పుకోలేద‌ని

Crime News భ‌ర్తతో విడాకులు, మరొకరితో మ‌ళ్లీ ప్రేమ,పెళ్లికి ఒప్పుకోలేద‌ని

మానవ సంబంధాలు చాలా సున్నితమైనవి. జాగ్రత్తగా వ్యవహరించకపోతే జీవితాలు నాశనమవుతాయి. ఇలాంటి సంఘటనే తాజాగా బెంగళూరులోని బనశంకరిలో జరిగింది. తనతో పెళ్ళికి ఒప్పుకోలేదనే కారణంతో ఒక వివాహితపై యాసిడ్ దాడి చేశాడు ఒక దుర్మార్గుడు.

కర్ణాటక అగరబత్తి  పరిశ్రమలో పనిచేస్తోన్న సదరు మహిళకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న అహ్మద్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అహ్మద్ సైతం భార్యకు దూరంగా ఉంటున్నాడు.

పెళ్ళి చేసుకుందాని అహ్మద్ ఆ మహిళను కోరగా అందుకు నిరాకరించింది. తన కొడుకు పెద్దవాడయ్యాడనే కారణంగా ఆమె ఒప్పుకోలేదు. అయితే ఆ మహిళ ఆఫీసుకు వెళ్తున్న సమయంలో గొడవపడ్డ అహ్మద్, ఆమెపై యాసిడ్ చల్లి పరారైయ్యాడు. మహిళ కుడి కన్నుకి పెద్ద గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటన కుమారస్వామి లేఔట్ పరిధిలో జరిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి