sai
sai
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
“నాకు కరోనా మైల్డ్ సింప్టమ్స్ బయటపడ్డాయి. ప్రస్తుతం నేను స్వీయ నిర్భంధంలో ఉన్నాను. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి. అలాగే వ్యాక్సినేషన్ కూడా వెంటనే చేయించండి. దానివల్ల కోవిడ్ ప్రభావం తక్కువగా ఉంటుంది..“ అని మహేష్ బాబు పోస్ట్ చేశారు. ప్రజలంతా కోవిడ్ కి సంబంధించి ప్రభుత్వ నియమనిబంధనలు తప్పకుండ పాటించాలని మహేష్ కోరారు.
మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్ర షూటింగ్ ను అతి త్వరగా ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం తరువాత మహేష్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో చేయాల్సి ఉంటుంది.
ఈమధ్యే మహేష్ బాబుకి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో, తాజాగా కోవిడ్ పాజిటివ్ అని మహేష్ వెల్లడించటంతో ఆయన ఫాన్స్ ఆందోళనలో ఉన్నారు.. దీనివల్ల షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా పడనున్నాయి. ఆయన ఈ కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకొని మన ముందుకు అతి త్వరలో పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుందాం.
Also Read : Mahesh Babu : సూపర్ స్టార్ ఫ్యాన్స్ ముందే సిద్ధపడాలి