iDreamPost
android-app
ios-app

విజయవాడకు అచ్చెం నాయుడు.. మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు

విజయవాడకు అచ్చెం నాయుడు.. మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు

ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్‌ చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడును ఏసీబీ అధికారులు విజయవాడకు తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం విజయవాడ ఏసీబీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అచ్చెంనాయుడుకు వైద్య పరీక్షలు ఏసీబీ కార్యాలయంలోనే జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. వైద్య బృందాన్ని ఏసీబీ కార్యాలయానికే పిలిపించారు. వైద్య పరీక్షల తర్వాత అచ్చెం నాయుడుని ఏసీబీ కోర్టులో హాజరపరచనున్నారు. అచ్చెం నాయుడు అరెస్ట్‌ను ఇప్పటికే ఏసీబీ ధృవీకరించిన విషయం తెలిసిందే.

ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో ఎలక్ట్రానిక్‌ మీడియా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో.. వచ్చే సమయంలో తాను ఇబ్బందేమీ పడలేదని, అధికారులు ఇబ్బంది పెట్టలేదని అచ్చెంనాయుడు చెప్పారు. ‘‘రమ్మంటే ఇక్కడకు వచ్చాను. ఏమి అడుగుతారో చెప్పిన తర్వాత వచ్చి మాట్లాడతాను’’ అని చెబుతూ అచ్చెంనాయుడు ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లారు.