sai
sai
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..ఈ రోజు తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి కి వెళ్లారు. ఇటీవల వ్యాయామం చేస్తుండగా.. సీఎం కాలుకు గాయమైంది. చికిత్స తీసుకున్న తర్వాత నయమయింది.అయితే అకస్మాత్తుగా ఈ రోజు గాయమైన చోట వాపు కనిపించడంతో వ్యక్తిగత వైద్యుని సలహా మేరకు.. పరీక్షలు చేయించుకునేందుకు మణిపాల్ ఆస్పతికి వెళ్లారు.
దాదాపు రెండు గంటల పాటు ఆస్పత్రిలోనే సీఎం జగన్ ఉన్నారు. ప్రత్యేక విశ్రాంతి గదిలో వైద్యులు ముఖ్యమంత్రికి వైద్యం చేశారు. పలు పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ తన నివాసానికి వెళ్లారు. యధావిధిగా తన రోజు వారీ కార్యకలాపాలను కొనసాగించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ ముందుగా నిర్ణయించిన ప్రకారం.. విద్యాశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Also Read : Apcm Ys Jagan,3 Capitals – సీఎంల సదస్సులో మూడు రాజధానుల అంశం, విశాఖ, కర్నూలు అభివృద్ధికి జగన్ ప్రయత్నాలు