iDreamPost
android-app
ios-app

నడిరోడ్డుపై దగ్ధమైన బస్సు

నడిరోడ్డుపై దగ్ధమైన బస్సు

ముంబయ్ నుండి హైదరాబాద్ కి వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన బస్సు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా దగ్ధమైంది. బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ క్షేమంగా బయట పడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా ప్రయాణికులు కిందకి దిగిన కొద్ది క్షణాల్లోన్నే బస్సు మొత్తం పూర్తిగా దగ్దమైంది.. ఈ ప్రమాదంలో ప్రయాణికుల సామాన్లు, వస్తువులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. కాగా బస్సు ఇంజిన్ నుండి మంటలు వ్యాపించాయని ప్రయాణికులు చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. డ్రైవర్ అప్రమత్తం కాకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు.

marsbahis girişjojobet girişjojobet