iDreamPost
android-app
ios-app

జమ్ముకశ్మీర్ లో ఆర్మీ జవాన్ అదృశ్యం! కారులో రక్తపు మరకలు..

జమ్ముకశ్మీర్ లో ఆర్మీ జవాన్ అదృశ్యం! కారులో రక్తపు మరకలు..

పహారా కాస్తున్న ఓ ఆర్మీ జవాన్ ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం అనేది సంచలనంగా మారుతోంది. ఇదే విషయాన్ని ఆర్మీ తాజాగా అధికారంగా తెలపడం విశేషం. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? అతడు కనిపించకుండా పోయిన కారులో రక్తపు మరకలు ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగిందంటే? జమ్ముకశ్మీర్ లోని కుల్గం జిల్లా అచ్చత్ ఏరియాకు చెందిన జవేద్ అహ్మద్ వని లద్దాఖ్ రీజయన్ లో పహారా కాస్తున్నారు. అయితే శనివారం అతను ఉన్న ప్రాంతం నుంచి ఉన్నట్టుండి కనిపించకుండాపోయాడు. దీంతో ఆర్మీ అధికారులు అప్రమత్తమై చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతటా వెతికారు. కానీ, జవేద్ అహ్మద్ వని ఆచూకి మాత్రం దొరకలేదు.

ఇదిలా ఉంటే.. అతను పహారా కాస్తున్న ఆయన కారులో రక్తపు మరకలు కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయాన్ని ఆర్మీ అధికారులు తాజాగా అధికారికంగా తెలిపారు. దీంతో అప్పటి నుంచి ఆర్మీ అధికారులు బృందాలుగా విడిపోయి జవాన్ జవేద్ అహ్మద్ వని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉగ్రవాదులు హత్య చేశారా? లేక దాడి చేసి ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న జవేద్ అహ్మద్ వని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఆర్మీ జవాన్ కనిపించకుండాపోవడంతో అంతా షాక్ గురవుతున్నారు. ఇదే వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: మతం మారినందుకు అంజుకి బహుమతుల వెల్లువ.. ఇళ్ల స్థలం, నగదు..!

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvolePradabet güncel girişcasibompokerklasJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet